NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సన్నబియ్యం పంపిణీకి ముహూర్తం ఫిక్స్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సన్నబియ్యం పంపిణీకి ముహూర్తం ఫిక్స్
    తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..సన్నబియ్యం పంపిణీకి ముహూర్తం ఫిక్స్

    Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సన్నబియ్యం పంపిణీకి ముహూర్తం ఫిక్స్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 21, 2025
    05:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రజలకు ముఖ్యమైన ప్రకటనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది.

    ఉగాది పండుగ సందర్భంగా పేదల ఇళ్లలో సంతోష భరిత వాతావరణాన్ని సృష్టించేలా నిర్ణయం తీసుకుంది.

    ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందడుగు వేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్, వాటిని ఒక్కొటిగా అమలు చేస్తోంది.

    ఈ క్రమంలో, రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం తుది ముహూర్తాన్ని ఖరారు చేసింది.

    సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారికంగా ప్రకటించినట్లుగా, ఉగాది పండుగ రోజునే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

    వివరాలు 

    పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

    ఉగాది పండుగ రోజున రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

    పండుగ రోజున హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఆయన స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

    అలాగే, ఆ రోజు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్యతో కలిసి మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

    అనంతరం, మటంపల్లి ఆలయంలో జరిగే పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని, అలా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుడతారు.

    రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపులలో ఉగాది పండుగ నుంచే సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

    వివరాలు 

    కుటుంబ సభ్యుడికి నెలకు 6 కిలోల బియ్యం 

    ఈ పంపిణీని మటంపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

    ఇందుకు సంబంధించి అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసి, త్వరలోనే పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

    ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

    ఆహార భద్రత కార్డుదారులకు ఉగాది నుంచి సన్న బియ్యం అందజేయనున్న ప్రభుత్వం, ప్రతి కుటుంబ సభ్యుడికి నెలకు 6 కిలోల చొప్పున ఈ బియ్యాన్ని పంపిణీ చేయనుంది.

    ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యాన్ని తినేందుకు అనువుగా లేదని, అందుకే దానికి బదులుగా సన్న బియ్యాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది.

    వివరాలు 

    ఉగాది పండుగ రోజున ముహూర్తం ఖరారు

    గతంలో దొడ్డు బియ్యాన్ని తీసుకున్న వారిలో 85% మంది, దాన్ని మార్కెట్లో కిలోకు రూ.10 చొప్పున అమ్మేసేవారని, మరోవైపు వ్యాపారులు ఆ బియ్యాన్ని పాలిష్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది.

    ఈ పరిణామాల నేపథ్యంలో, రేవంత్ రెడ్డి సర్కార్ దొడ్డు బియ్యానికి బదులుగా అందరూ తినదగిన సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది.

    గత కొంత కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ కార్యక్రమాన్ని ఎట్టకేలకు ఉగాది పండుగ రోజున ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Harrop Drone: ఇజ్రాయెల్‌ తయారీ దీర్ఘశ్రేణి లాయిటరింగ్‌ మ్యునిషన్‌ 'హారప్‌'.. భారత అమ్ములపొదిలో మెగా అస్త్రం  భారతదేశం
    Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం పాకిస్థాన్
    Adani & Ambani: 'దేశ సాయుధ బలగాలకు అండగా ఉంటాం'.. అదానీ, అంబానీ  గౌతమ్ అదానీ
    Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..?  పాకిస్థాన్

    తెలంగాణ

    Yasangi Season: యాసంగి పంటల కోసం సాగునీటి విడుదల - వారబందీ విధానానికి నీటి పారుదల శాఖ ప్రణాళిక   భారతదేశం
    Telangana: ప్యూచర్‌ సిటీ, గ్రామీణాభివృద్ధి కోసం.. అంతర్జాతీయ కన్సల్టెన్సీల సహకారంతో 'బ్లూ అండ్‌ గ్రీన్‌', 'మొబిలిటీ' ప్రణాళికలు భారతదేశం
    Pranay Case Judgement: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు.. ఒకరికి ఉరిశిక్ష, ఆరుగురికి జీవితఖైదు  మిర్యాలగూడ
    Jagga Reddy: రాజకీయ నాయకుడి నుంచి నటుడిగా.. 'జగ్గారెడ్డి' ఫస్ట్ లుక్ విడుదల టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025