
Kunal Kamra: డిప్యూటీ సీఎం షిండేపై వ్యాఖ్యలు.. కునాల్ కమ్రాపై మరో 3 కేసులు
ఈ వార్తాకథనం ఏంటి
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మరింత ఇబ్బందుల్లో పడుతున్నారు. మహారాష్ట్రలో ఆయనపై తాజాగా మూడు కేసులు నమోదయ్యాయి.
డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. షిండేను ఉద్దేశించి 'ద్రోహి' అంటూ సంబోధించడంతో శివసేన కార్యకర్తలు భగ్గుమన్నారు.
దీనికి ప్రతిగా కునాల్ కమ్రా నిర్వహించిన క్లబ్పై కార్యకర్తలు దాడి చేశారు. అనంతరం ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కునాల్ కమ్రా తమిళనాడులో ఉన్నారు.
ముంబై పోలీసులు పలుమార్లు సమన్లు జారీ చేసినా ఆయన హాజరుకాలేదు. అరెస్ట్ చేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై పోలీసులపై ఒత్తిడి తెస్తున్నా ఇప్పటివరకు సాధ్యం కాలేదు.
Details
మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన కమ్రా
ఈ నేపథ్యంలో కమ్రా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కునాల్ కమ్రా వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తీవ్రంగా స్పందించారు. సుపారీ ఇచ్చి మాట్లాడించినట్లు ఉందని షిండే వ్యాఖ్యానించారు.
శివసేన కార్యకర్తల దాడిని సమర్థించనని, కానీ న్యూటన్ సిద్ధాంతం ప్రకారం చర్యకు ప్రతి చర్య ఉంటుందని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా కునాల్ కమ్రా వ్యాఖ్యలను ఖండించి, షిండేకు మద్దతుగా నిలిచారు.