Page Loader
Congress-BJP: ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలు.. నాంపల్లిలో కాంగ్రెస్‌-బీజేపీ కార్యకర్తల ఘర్షణ
ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలు.. నాంపల్లిలో కాంగ్రెస్‌-బీజేపీ కార్యకర్తల ఘర్షణ

Congress-BJP: ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలు.. నాంపల్లిలో కాంగ్రెస్‌-బీజేపీ కార్యకర్తల ఘర్షణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 07, 2025
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాంపల్లిలో కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకుడు రమేశ్‌ బిదూరీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిరసనగా యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద ముట్టడికి దిగారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలు వారికి అడ్డుగా నిలిచి ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, బీజేపీ కార్యాలయంపైకి రాళ్లు విసరడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

Details

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల ప్రయత్నాలు

దీంతో బీజేపీ శ్రేణులు కర్రలతో కాంగ్రెస్‌ కార్యకర్తల వెంటపడ్డారు. ఈ హింసాత్మక ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఉద్రిక్తతల మధ్య ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గట్టి చర్యలు తీసుకున్నారు.