Page Loader
TS Elections : మంత్రి కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కాంగ్రెస్
మంత్రి కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కాంగ్రెస్

TS Elections : మంత్రి కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న కాంగ్రెస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 29, 2023
06:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ చేస్తున్న దీక్షా దివస్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీక్షా దివస్ కార్యక్రమాలను నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ ఛైర్మన్ జి.నిరంజన్ తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఇక దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడాన్ని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి, మీడియాపై ఆంక్షలు, 144 సెక్షన్ అమల్లో ఉన్నా దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించడం ఓటర్లను ప్రభావితం చేయడమేనని కాంగ్రెస్ పేర్కొంది.

Details

నిబంధనలను లోబడి నిర్వహించుకోవాలని ఈసీ సూచన

కాంగ్రెస్ ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ స్క్వాడ్ తెలంగాణ భవన్‌కు వెళ్లి దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని బీఆర్ఎస్ నాయకులను కోరింది. అయితే ఇది కొత్త కార్యక్రమం కాదని, ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. తెలంగాణ భవనం లోపల నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని అధికారులు సూచించారు. దీంతో భవనం లోపల ఆ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నేతలు చేపట్టారు.