NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / HARISH RAO : రంగంలోకి మంత్రి హరీశ్ రావు.. బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి
    తదుపరి వార్తా కథనం
    HARISH RAO : రంగంలోకి మంత్రి హరీశ్ రావు.. బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి
    రంగంలోకి మంత్రి హరీశ్ రావు.. బీఆర్ఎస్‌లోకి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి

    HARISH RAO : రంగంలోకి మంత్రి హరీశ్ రావు.. బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 12, 2023
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారుతున్నాయి. ఓ వైపు ఎన్నికల కోడ్, మరోవైపు పార్టీలకు చెందిన నేతల జంపింగ్స్, వెరసి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.

    ఈ క్రమంలోనే మల్కాజిగిరి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంత రావుకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతోంది.ఈ మేరకు మంత్రి హరీశ్ రావు ఆహ్వానంతో పట్లోళ్ల శశిధర్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లనున్నారు.

    అధికార పార్టీని వీడి, ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరిన మైనంపల్లికి మెదక్ రాజకీయాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి.

    మైనంపల్లి హస్తం పార్టీలో చేరాక డీసీసీ చీఫ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రాజీనామా చేసి, బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.కంఠారెడ్డి నివాసానికి స్వయంగా వెళ్లిన మంత్రి హరీష్ ఆయన్ను ఒప్పించి గులాబీ గూటికి చేర్చారు.

    details

    స్వయంగా పట్లోళ్ల ఇంటికెళ్లిన మంత్రి హరీశ్

    తాజాగా అదే పంథాలో పట్లోళ్ల శశిధర్ రెడ్డి ఇంటికీ మరోసారి స్వయంగా వెళ్లిన మంత్రి హరీశ్ తమ పార్టీలో చేరాలని అభ్యర్థించారు.

    గులాబీ గూటికి వస్తే, మంచి గుర్తింపు ఇస్తామని, రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవి అప్పగిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.

    2004లో కాంగ్రెస్ తరపున మెదక్ ఎమ్మెల్యేగా గెలిచిన శశిధర్ రెడ్డి, 2009లో మైనంపల్లి చేతిలో ఓటమిపాలయ్యారు.

    2014లో కాంగ్రెస్ మెదక్ సీటు విజయశాంతికి ఇవ్వటంతో శశిధర్ నిరాశకు గురయ్యారు. 2018లో ఉపేందర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతో బీజేపీలో చేరాడు.

    2023 మేలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనకే టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి పార్టీలోకి ఆహ్యానించారు. ఇంతలో మైనంపల్లి కాంగ్రెస్ రేసులోకి రావడంతో శిశిధర్ టిక్కెట్ అటకెక్కింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    బీఆర్ఎస్

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    తెలంగాణ

    తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు టీఎస్పీఎస్సీ
    తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్ళు, వాటి వివరాలు, టికెట్ ధరల ఇవే..   రైల్వే శాఖ మంత్రి
    తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, ఈవీఎంలను తనిఖీ చేశాం: సీఈఓ  అసెంబ్లీ ఎన్నికలు
    తెలంగాణకు వస్తున్న నరేంద్ర మోదీ.. ప్రధాని రాకతో బీజేపీ  ఎన్నికల ప్రచారం షురూ   నరేంద్ర మోదీ

    బీఆర్ఎస్

    సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారు.. టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగిపోతానన్న తీగల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట.. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ
    కాంగ్రెస్ గూటికి చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్.. ఇప్పటికే టిక్కెట్ కోసం దరఖాస్తు  కాంగ్రెస్
    తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ  గద్వాల
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025