NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట.. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట.. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు
    మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు

    బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట.. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 21, 2023
    03:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

    అయితే అంతకుముందే, ఈసారి ఎన్నికల్లో తనతో పాటు తన కుమారుడికి సైతం శాసనసభ టిక్కెట్ కేటాయించాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.

    ఈ నేపథ్యంలో మెదక్ టిక్కెట్ ను తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కోసం మైనంపల్లి పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    మెదక్‌ జిల్లాలో హరీశ్‌రావు పెత్తనం చెలయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అంతుచూసే వరకు తాను వదలబోనని ఘాటుగా వ్యాఖ్యానించారు.రానున్న ఎన్నికల్లో హరీశ్‌రావుకు అడ్రస్ లేకుండా చేస్తానని ఆయన హెచ్చరించారు.

    DETAILS

    టిక్కెట్లు ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతాం : మైనంపల్లి

    ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని మైనంపల్లి కుటుంబం దర్శించుకుంది. దర్శనం తర్వాత పాత్రికేయులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    తన కుమారుడ్ని మెదక్ ఎమ్మెల్యేగా నిలబెట్టడమే తన లక్ష్యమని మైనంపల్లి తేల్చి చెప్పారు. తనకు,తన కుమారుడికి మల్కాజిగిరి, మెదక్ టికెట్లు ఇస్తేనే బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తామన్నారు.

    ఒకవేళ ఇద్దరికీ టిక్కెట్ ఇవ్వకుంటే, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని హెచ్చరించారు. హరీశ్ రావు అక్రమంగా రూ. లక్ష కోట్లు సంపాదించాడని మైనంపల్లి ఆరోపణలు గుప్పించారు.

    తనకు ఇప్పటికే పార్టీ టిక్కెట్ ప్రకటించిందన్న మైనంపల్లి, తన కుటుంబంలోనూ ఇద్దరికీ టిక్కెట్లు ఇవ్వాలని పట్టుబట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    అసెంబ్లీ ఎన్నికలు
    బీఆర్ఎస్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    తెలంగాణ

    జేపీ నడ్డా సమక్షంలో ఇవాళ బీజేపీలో చేరనున్న జయసుధ బీజేపీ
    దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే!  ఎమ్మెల్యే
    నేడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి   కాంగ్రెస్
    భారతీ సిమెంట్స్‌ ఎఫ్‌డీ కేసు; తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే సుప్రీంకోర్టు

    అసెంబ్లీ ఎన్నికలు

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే  కర్ణాటక
    కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి  కర్ణాటక
    Karnataka Elections 2023: హిమాచల్ ఎన్నికల ఫలితాలే కర్ణాటకలో రిపీట్ అవుతాయా?  కర్ణాటక
    'కాంగ్రెస్ 'వారంటీ' గడువు ముగిసింది'; హస్తం పార్టీపై ప్రధాని మోదీ సెటైర్లు నరేంద్ర మోదీ

    బీఆర్ఎస్

    సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారు.. టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగిపోతానన్న తీగల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025