Page Loader
PM Modi: 'కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది'..అంబేద్కర్ వివాదంపై మోదీ స్పందన
'కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది'..అంబేద్కర్ వివాదంపై మోదీ స్పందన

PM Modi: 'కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది'..అంబేద్కర్ వివాదంపై మోదీ స్పందన

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 18, 2024
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను అవమానించారనే కాంగ్రెస్ ఆరోపణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అంబేద్కర్‌కు గౌరవం, మర్యాదలో ఎటువంటి లోపం లేదని మోదీ ఇవాళ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పష్టం చేశారు. అంబేద్కర్‌కు గౌరవం కల్పించడంలో తమ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. మోదీ తమ ప్రభుత్వ బాధ్యతలను తెలియజేస్తూ, అంబేద్కర్ జీవితానికి సంబంధించి ఐదు ముఖ్యమైన ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులు గతంలో చాలా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండగా, తమ ప్రభుత్వం వాటిని పూర్తి చేసిందన్నారు.

Details

 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చాం

అంబేద్కర్ విజన్‌ను అమలు చేయడంలో తమ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని, 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని ప్రధాని వివరించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలను బలోపేతం చేయడంతో పాటు, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాల ద్వారా అణగారిన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చామని అన్నారు. అమిత్ షా రాజ్యసభలో మాట్లాడుతూ అంబేద్కర్ పేరును ప్రతిపక్షాలు అధికంగా ఉపయోగించడం ఒక ఫ్యాషన్‌గా మారిందని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ స్థానంలో దేవుడిని ప్రార్థిస్తే, వాళ్లు స్వర్గానికి వెళ్లేవారన్న మాటలను ప్రతిపక్షాలు తప్పుగా అర్థం చేసుకున్నాయని పేర్కొన్నారు.

Details

 రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల‌తో మోదీ కీలక భేటీ 

మోదీ, అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తూ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. దీనిపై మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ అంబేద్కర్ వారసత్వాన్ని అనేక దశాబ్దాలుగా నిర్వీర్యం చేస్తోందని, ఒక కుటుంబం, ఒక పార్టీనే ఈ బాధ్యత తీసుకుంటోందని ఆరోపించారు. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్‌పర్సన్ ఎంపిక సందర్భంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అంబేద్కర్ పేరు ప్రస్తావనకు రావడం చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా వ్యాఖ్యలు మంగళవారం జరిగిన రాజ్యసభ సమావేశంలో ప్రతిపక్షాలు తీవ్రంగా నిరసించాయి. కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు అమిత్ షా తన మాటలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.