NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గోసంరక్షణ పేరుతో ఉద్రిక్తతలు సృష్టించే వారిని తరిమేయండి: కాంగ్రెస్
    తదుపరి వార్తా కథనం
    గోసంరక్షణ పేరుతో ఉద్రిక్తతలు సృష్టించే వారిని తరిమేయండి: కాంగ్రెస్
    గోసంరక్షణ పేరుతో ఉద్రిక్తతలు సృష్టించే వారిని తరిమేయండి: కాంగ్రెస్

    గోసంరక్షణ పేరుతో ఉద్రిక్తతలు సృష్టించే వారిని తరిమేయండి: కాంగ్రెస్

    వ్రాసిన వారు Stalin
    Jun 28, 2023
    01:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గతంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రభుత్వ హయాంలో ఆమోదించిన గోహత్య నిరోధక చట్టాన్ని తాము ఉపసంహరించుకుంటామని కొన్ని వారాల క్రితం కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి కె వెంకటేష్ ప్రకటించారు.

    అయితే త్వరలో బక్రీద్ (జూన్ 29) వేడుక జరగనున్న నేపథ్యంలో గోవధ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

    ఈ విషయంపై కర్ణాటక కాంగ్రెస్ నేత, మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడారు. గోసంరక్షణ పేరుతో బక్రీద్ సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించే వ్యక్తులపై నిఘా ఉంచాలని పోలీసులను కోరారు.

    ఈ క్రమంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయకూడదని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) వాదిస్తోంది.

    తమది ఈ సేన, తమది ఆ దళం అంటూ చెప్పుకుంటూ శాలువాలు ధరించి వచ్చిన వారిని తరిమేయాలని ఖర్గే చెప్పారు.

    కాంగ్రెస్

    పశువులను చట్టపరంగా రవాణా చేస్తున్న వారిని వేధించొద్దు: ఖర్గే 

    పశువులను చట్టపరంగా రవాణా చేస్తున్న వ్యక్తులను వేధించడం మానుకోవాలని తాను పోలీసు అధికారులను ఆదేశించానని మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు.

    చట్టాన్ని సేనలు, దళాలు వారి చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతిస్తే మీ పని ఏమిటని మంత్రి ప్రియాంక్ ఖర్గే పోలీసులను ప్రశ్నించారు.

    చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వాళ్లును పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టాలని స్థానిక అధికారులను కోరారు.

    పశువుల రవాణాకు సంబంధించిన పత్రాలు, వెటర్నరీ సర్టిఫికేట్ ఉన్నవారిని అడ్డుకోకూడదని, అయితే కాగితాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసులకు సూచించారు.

    మత ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేసిన ఖర్గే, విభజన సిద్ధాంతాలను ప్రచారం చేసే స్వయం ప్రకటిత నాయకులపై చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

    కాంగ్రెస్

    పశువులను అమ్మడం, కొనడం సహజం: ఖర్గే

    పశువులను, ముఖ్యంగా ఆవులను రవాణా చేయడంపై స్పష్టమైన చట్టం ఉందని, దానిని పాటించాలని మంత్రి కోరారు.

    కర్ణాటకలో ఇది స్థానిక జాతరల సీజన్ అని ఖర్గే పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రజలు పశువులను అమ్మడం, కొనడం చేస్తుంటారని చెప్పారు.

    సేనలు, దళాల పేరుతో శాలువాలు కప్పుకొని వచ్చే వారికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అర్థం కావడం లేదని స్పష్టం చేశారు. తాను ఒక వ్యక్తి నుంచి ఆవును కొనుగోలు చేసి ఇంటికి రవాణా చేస్తానని, ఇది చట్టబద్ధమైన విషయం అన్నారు.

    చట్టబద్ధంగా పశువులను రవాణా చేసేవారిపై సేనలు, దళాల పేరుతో దాడులు చేస్తున్నారని, వారిని అడ్డుకోవాలని సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    కాంగ్రెస్
    బీజేపీ
    తాజా వార్తలు

    తాజా

    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా

    కర్ణాటక

    మతం ఆధారంగా ఓట్లు అడగడం సిగ్గుచేటు : అక్బరుద్దీన్ ఓవైసీ బీజేపీ
    సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం; ఈసీకి ఫిర్యాదు  సోనియా గాంధీ
    4శాతం ముస్లిం రిజర్వేషన్లలపై రాజకీయ ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం  సుప్రీంకోర్టు
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే అసెంబ్లీ ఎన్నికలు

    కాంగ్రెస్

    కర్ణాటక ఎన్నికల ఫలితాలు: ఎమ్మెల్యేందరూ బెంగళూరు చేరుకోవాలని కాంగెస్ పిలుపు కర్ణాటక
    కర్ణాటక ఎన్నికల్లో ఆధిక్యంపై ​​కాంగ్రెస్ 'అన్‌స్టాపబుల్' ట్వీట్  కర్ణాటక
    కాంగ్రెస్: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్‌; కర్ణాటక సీఎం ఎవరు?  కర్ణాటక
    కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై డీకే శివకుమార్ భావోద్వేగం కర్ణాటక

    బీజేపీ

    యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రఘువీరా రెడ్డి; కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక బాధ్యతలు ఆంధ్రప్రదేశ్
    రాహుల్ గాంధీకి చుక్కెదురు; జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ కోర్టు నిరాకరణ  రాహుల్ గాంధీ
    ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ట్విట్టర్
    Karnataka Elections 2023: హిమాచల్ ఎన్నికల ఫలితాలే కర్ణాటకలో రిపీట్ అవుతాయా?  కర్ణాటక

    తాజా వార్తలు

    బీఎంసీ కోవిడ్ స్కామ్ దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేసిన ముంబై పోలీసులు ముంబై
    టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఆ సమయంలోనే పేలి ఉంటుంది: 'టైటానిక్' దర్శకుడు జేమ్స్ కామెరూన్  అట్లాంటిక్ మహాసముద్రం
    యూపీఏ ప్రభుత్వం 12 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడింది: అమిత్ షా అమిత్ షా
    నేడు బోయింగ్, అమెజాన్, గూగుల్ సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశం నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025