NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ
    తదుపరి వార్తా కథనం
    Congress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ
    అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే: రాహుల్

    Congress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ

    వ్రాసిన వారు Stalin
    Feb 26, 2023
    03:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ మూడో రోజుకు చేరుకున్నాయి. ముగింపు సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదాని-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు.

    పార్లమెంట్‌లో అదానికి బీజేపీ నేతలు ఎందుకు రక్షణగా నిలిచారని ప్రశ్నించారు. గౌతమ్‌ అదానీ, ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరూ ఒక్కటే అని ఆరోపించారు. అదాని వ్యవహారంలో నిజం బయటకు వచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు.

    దశ స్వాతంత్య్ర పోరాటం కూడా ఒక కంపెనీకి వ్యతిరేకంగా జరిగిందని రాహుల్ పేర్కొన్నారు. అది దేశంలోని సంపద, ఓడరేవులను స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు. ఇప్పుడు చరిత్ర పునరావృత కాబోతోందని రాహల్ వెల్లడించారు. అదాని గ్రూప్ వల్ల దేశాన్ని బాధిస్తోందని వివరించారు.

    రాహుల్ గాంధీ

    భారత్ జోడో యాత్రలో నేను చాలా నేర్చుకున్న: రాహుల్

    భారత్ జోడో యాత్రలో తాను చాలా నేర్చుకున్నట్లు రాహుల్ గాంధీ వివరించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశం కోసం తాను నడిచానన్నారు. యాత్రలో వేలాదిమందితో మాట్లాడినట్లు చెప్పారు. తాను రైతుల బాధలు విన్నానని, అన్ని సమస్యలను తెలుసుకున్నానని వెల్లడించారు.

    దేశ ఆర్థిక వ్యవస్థపై విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

    చైనా కంటే భారత ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నదిని, వారితో పోరాడలేమని ఇటీవల జైశంకర్ వ్యాఖ్యానించారు. దానికి ఇప్పుడు రాహుల్ కౌంటర్ ఇచ్చారు.

    బలవంతుడి ముందు తలవంచడం సావర్కర్ సిద్ధాంతమన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ భరత్ కంటే పెద్దది కాబట్టి వారతో మనం వారితో పోరాడలేమని మంత్రి చెప్పడం జాతీయవాదం కాదని, పిరికితనం అవుతుందని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    ఛత్తీస్‌గఢ్
    రాయ్‌పూర్
    కాంగ్రెస్

    తాజా

    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్
    Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్‌బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర
    Vishal-Sai Dhansika: విశాల్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్‌ విశాల్
    Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక  హైదరాబాద్

    రాహుల్ గాంధీ

    'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్ జమ్ముకశ్మీర్
    సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం' కాంగ్రెస్
    'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ జమ్ముకశ్మీర్
    నేడు శ్రీనగర్‌లో 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుక, 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం జమ్ముకశ్మీర్

    ఛత్తీస్‌గఢ్

    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది గణతంత్ర దినోత్సవం
    బీజేపీ మండలాధ్యక్షుడిని హత్య చేసిన మావోయిస్టులు బీజేపీ
    రాయ్‌పూర్, దుర్గ్-భిలాయ్‌లో 5G సేవలను ప్రారంభించిన ఎయిర్ టెల్ ఎయిర్ టెల్
    ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి రోడ్డు ప్రమాదం

    రాయ్‌పూర్

    కాంగ్రెస్ ప్లీనరీ: సీడబ్ల్యూసీకి ఎన్నికలు వద్దంటూ తీర్మానం; ఖర్గేకు బాధ్యత అప్పగింత కాంగ్రెస్
    కాంగ్రెస్ ప్లీనరీలో రోశయ్య, జైపాల్‌రెడ్డికి సంతాపం; రెండో‌రోజు సెషన్‌కు సోనియా, రాహుల్ హాజరు కాంగ్రెస్
    Congress Plenary: పొలిటికల్ రిటైర్మెంట్‌పై సోనియా కీలక ప్రకటన; బీజేపీ పాలనపై ఫైర్ కాంగ్రెస్

    కాంగ్రెస్

    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ దిల్లీ
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు బీజేపీ
    'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు జమ్ముకశ్మీర్
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025