NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress : 'కేసీఆర్ పాలనపై చిదంబరం కీలక వ్యాఖ్యలు.. అవన్నీ తెలంగాణలోనే ఎక్కువట'
    తదుపరి వార్తా కథనం
    Congress : 'కేసీఆర్ పాలనపై చిదంబరం కీలక వ్యాఖ్యలు.. అవన్నీ తెలంగాణలోనే ఎక్కువట'
    'తెలంగాణపై దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు.. అవన్నీ తెలంగాణలోనే ఎక్కువ'

    Congress : 'కేసీఆర్ పాలనపై చిదంబరం కీలక వ్యాఖ్యలు.. అవన్నీ తెలంగాణలోనే ఎక్కువట'

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 16, 2023
    06:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్ జాతీయ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు.

    గురువారం నాంపల్లి గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన చిదంబరం, దేశవ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉందని చిదంబరం అన్నారు.

    తెలంగాణలో అర్బన్ నిరుద్యోగి రేటు దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న 80 వేల ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయలేదని నిలదీశారు.

    ఇదే సమయంలో నిరుద్యోగం, అధిక ధరలను నియంత్రించడంలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఫెయిలైందన్నారు.

    తెలంగాణ అప్పులు రూ.3.66లక్షల కోట్లకు పెరిగాయని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలంటే కాంగ్రెస్ రావాలన్నారు.

    DETAILS

    కేసీఆర్ పాలనలో నిత్యావసర ధరలు కూడా పైపైనే 

    మరోవైపు నిరుద్యోగ భృతి హామీని అమలు చేయలేదని, నిరుద్యోగ రేటు మహిళల్లో 9.5 శాతం ఉండగా, పురుషుల్లో 7.8 శాతంగా ఉందని లెక్కలతో సహా వివరించారు.

    కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. తెలంగాణలోని ప్రతి పౌరుడిపై సగటున రూ. లక్ష మేర అప్పు ఉంచారని ఎద్దేవా చేశారు.

    విద్యా రంగానికి కేసీఆర్ కేటాయిస్తున్న నిధులు దేశ సగటు కంటే తక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను కాంగ్రెస్సే కట్టిందన్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి కాంగ్రెస్ ఘనతేనన్నారు.

    రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని, ఈ మేరకు నిత్యావసర ధరలు పెరిగాయన్నారు.

    పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు ఇక్కడే ఎక్కువన్నారు. ఇక్కడి ప్రభుత్వం వ్యాట్ అధికరంగా వసూలు చేస్తోందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్

    తాజా

    Jasprit Bumrah: బుమ్రా స్పెల్‌కి షాక్‌! ప్రాక్టీసు మ్యాచులో హడలెత్తిన బ్యాటర్లు జస్పిత్ బుమ్రా
    Toyota Fortuner: టయోటా ఫార్చ్యూనర్ ధర పెంపు.. కొనుగోలుదారులకు షాక్!  టయోటా ఫార్చ్యూనర్‌
    Balakrishna: అలాంటి చిత్రాలు, పాత్రల్లో నటించాలని ఉంది.. బాలయ్య బర్త్‌డే స్పెషల్‌ బాలకృష్ణ
    Tejas: భారత్‌ చేపట్టిన ఐదోతరం యుద్ధ విమానాలకు ఇంజిన్లు సరఫరా చేసేందుకు జీఈ ఆసక్తి  అమెరికా

    కాంగ్రెస్

    కాంగ్రెస్,ఒవైసీలు హమాస్‌కు మద్దతు ఇచ్చి,ఉగ్రవాదాన్ని సమర్దిస్తున్నాయి: బండి సంజయ బండి సంజయ్
    కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా మల్లికార్జున ఖర్గే
    Ponnala : పొన్నాలకు తెరుచుకున్న బీఆర్ఎస్ తలుపులు.. పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్‌ బీఆర్ఎస్
    ప్రవల్లికది ఆత్మహత్య కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ హత్య:  రాహుల్ గాంధీ ఆగ్రహం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025