NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హైదరాబాద్ వేదికగా కీలక సీడబ్ల్యూసీ సమావేశాలు.. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం గురి
    తదుపరి వార్తా కథనం
    హైదరాబాద్ వేదికగా కీలక సీడబ్ల్యూసీ సమావేశాలు.. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం గురి
    తెలంగాణపై కాంగ్రెస్ గురి

    హైదరాబాద్ వేదికగా కీలక సీడబ్ల్యూసీ సమావేశాలు.. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం గురి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 01, 2023
    11:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణపై ఏఐసీసీ(అఖిల భారత జాతీయ కాంగ్రెస్) ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను హైదరాబాద్ వేదికగా నిర్వహించనుంది.

    రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం, రానున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

    ఈ మేరకు అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా సన్నద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగింది.

    టీపీసీసీ ప్రతిపాదన మేరకు కాంగ్రెస్ జాతీయ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏఐసీసీ ఆమోదించింది.

    పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ సహా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 39 మంది వర్కింగ్‌ కమిటీ సభ్యులు రాష్ట్రానికి రానున్నారు.

    DETAILS

    కేసీఆర్ పై సోనియా ధ్వజమెత్తే అవకాశం

    కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం చివరి రోజు సెప్టెంబరు 17న విలీన దినోత్సవాన్ని జరపనున్నారు.

    హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజును పురస్కరించుకుని సోనియా గాంధీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

    తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ, హైదరాబాద్‌ వేదికగా మాట్లాడనుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి.

    సీఎం కేసీఆర్‌ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజుకోనుంది. ఈ మేరకు కాంగ్రెస్ ఎన్నికల సమర శంఖారావం పూరించనుంది.

    17న, 100 మందికిపైగా పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు సమాచారం.

    మరోవైపు అక్టోబరు 2 నుంచి టీపీసీసీ బస్సు యాత్ర చేపట్టనుంది. నెల రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ/సీడబ్ల్యూసీ
    తెలంగాణ
    మల్లికార్జున ఖర్గే

    తాజా

    SRH vs KKR: కోల్‌కతా ఘోర ఓటమి.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్
    Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైద‌రాబాద్.. అత్య‌ధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే! సన్ రైజర్స్ హైదరాబాద్
    Kakani Govardhan: క్వార్ట్జ్‌ అక్రమాల కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి
    GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే చైన్నై సూపర్ కింగ్స్

    కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ/సీడబ్ల్యూసీ

    రాజస్థాన్ కాంగ్రెస్ లో లుకలుకలు .. సొంత పార్టీ దిశగా సచిన్ పైలట్ రాజస్థాన్
    Congress : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరే! కాంగ్రెస్

    తెలంగాణ

    సూట్ కేసు సత్యనారాయణ వ్రత పీఠాన్ని చూశారా.. వడ్రంగి కళా నైపుణ్యానికి మంత్రి కేటీఆర్ ఫిదా కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    టీఎస్‌పీఎస్సీ లీకేజీలో మరో ముగ్గురు అరెస్ట్‌.. 99కి పెరిగిన లిస్ట్  టీఎస్పీఎస్సీ
    తెలంగాణలో మళ్లీ వానలు.. శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు భారీ వర్షాలు
    Telangana: దివంగత నాయినికి అరుదైన గౌరవం.. స్టీల్ బ్రిడ్జ్‌కు 'నాయిని నర్సింహారెడ్డి'గా నామకరణం హైదరాబాద్

    మల్లికార్జున ఖర్గే

    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కాంగ్రెస్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    రాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే రాహుల్ గాంధీ
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025