NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Visakhapatnam: విశాఖ కేంద్రంగా 'ఐటీ'.. ఐకానిక్‌ భవనం.. సిద్ధంగా 11 అంతస్తులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Visakhapatnam: విశాఖ కేంద్రంగా 'ఐటీ'.. ఐకానిక్‌ భవనం.. సిద్ధంగా 11 అంతస్తులు
    విశాఖ కేంద్రంగా 'ఐటీ'.. ఐకానిక్‌ భవనం.. సిద్ధంగా 11 అంతస్తులు

    Visakhapatnam: విశాఖ కేంద్రంగా 'ఐటీ'.. ఐకానిక్‌ భవనం.. సిద్ధంగా 11 అంతస్తులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 24, 2025
    08:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్టణంలో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకెళ్లుతున్నాయి.

    ఈ ప్రాంతంలో గూగుల్, ఇతర ప్రముఖ సంస్థలు కూడా తమ కేంద్రాలను నిర్వహించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి.

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటనలో డేటా సెంటర్, గ్లోబల్ బిజినెస్ సెంటర్, ఏఐ అభివృద్ధి కేంద్రం,చిప్ తయారీ కేంద్రం,గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ) వంటి సంస్థలతో చర్చలు జరిపారు.

    ఈ క్రమంలో తగిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

    ఇందుకోసం విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ)ఆధ్వర్యంలో ఐకానిక్ భవన సముదాయాన్ని సిద్ధం చేస్తున్నాయి.

    ఈ భవనాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

    వివరాలు 

    నౌక ఆకారంలో 11 అంతస్తుల్లో బహుళ అంతస్తుల కార్ల పార్కింగ్‌

    నగరంలోని ప్రధాన ప్రాంతంలో నౌక ఆకారంలో 11 అంతస్తుల బహుళ అంతస్తుల కార్ల పార్కింగ్ సదుపాయం (ఎంఎల్‌సీపీ) నిర్మాణం జరుగుతుంది.

    ఇందులో ఐదు అంతస్తుల్లో 1.90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్కింగ్‌కు, మరో ఆరు అంతస్తుల్లో 1.65 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కార్యాలయ అవసరాలకు ఉపయోగించనున్నారు.

    అత్యాధునిక సౌకర్యాలు, పార్కింగ్ వసతులతో రూపొందించిన ఈ భవనాన్ని గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా, అందంగా కనిపించేలా అద్దాలతో నిర్మించారు.

    వివరాలు 

    ప్రభుత్వంతో ప్రముఖ సంస్థలు ప్రతిపాదనలు

    కార్యకలాపాలు ప్రారంభించిన తరువాత గ్లోబల్ కేపబులిటీ సెంటర్, డేటా ఇంక్యుబేషన్ సెంటర్లకు అనుకూలంగా సువిశాల ప్రాంగణాలు సిద్ధంగా ఉండటంతో ఈ భవనాన్ని జీసీసీలకు, బహుళ జాతి సంస్థలకు కేటాయించే ఆలోచన ఉంది.

    దీనితో పాటు, త్వరలో ప్రారంభమయ్యే కార్యకలాపాలు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేలా ప్రభుత్వంతో ప్రముఖ సంస్థలు ప్రతిపాదనలు చేస్తున్నారు.

    నగర మధ్యభాగంలో ఉన్న ఈ భవనం, ప్రముఖ సంస్థలు ఇందులో చేరితే ఒక మంచి బ్రాండింగ్‌ను ఏర్పరుస్తుందని భావిస్తున్నారు.

    దావోస్‌లో సీఎం పర్యటన ముగిసిన తర్వాత ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

    వివరాలు 

    భవన ప్రత్యేకతలు:

    విస్తీర్ణం: 1.72 ఎకరాలు

    నిర్మాణ వ్యయం: రూ.87.50 కోట్లు

    అంతస్తులు: 11 (6 కార్యాలయాల కోసం, 5 పార్కింగ్ కోసం)

    పార్కింగ్: 430 కార్లు, 400 ద్విచక్ర వాహనాలు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    విశాఖపట్టణం

    Ap Government : ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టు షాక్.. విశాఖకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో హైకోర్టు
    Rajahmundry: రైలులో బిర్యానీ తిని 9 మందికి తీవ్ర అస్వస్థత  వైజాగ్
    Visakha Gang Rape : విశాఖలో దారుణం.. బాలికపై 10మంది గ్యాంగ్ రేప్  ఆంధ్రప్రదేశ్
    Coronavirus: వైజాగ్‌లో కరోనా కలవరం.. అధికారుల అలర్ట్  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025