NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Railway: 2027 నాటికి దేశంలో అన్ని రైల్వే గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక
    తదుపరి వార్తా కథనం
    Railway: 2027 నాటికి దేశంలో అన్ని రైల్వే గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక
    2027 నాటికి దేశంలో అన్ని రైల్వే గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక

    Railway: 2027 నాటికి దేశంలో అన్ని రైల్వే గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 30, 2025
    09:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రైల్వే గేట్ల వద్ద ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలు తొలగించబోతున్నాయి.

    2027 నాటికి దేశంలోని అన్ని రైల్వే గేట్ల స్థానంలో వంతెనలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి, అవసరమైన నిధులను కేటాయించింది.

    ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రంలో ఇటీవల రైల్వే శాఖ అధికారులు గేట్లు ఉన్న ప్రాంతాలను పరిశీలించి, ఆర్‌యూబీ (దిగువ వంతెన) లేదా ఆర్వోబీ (పైవంతెన) నిర్మాణానికి అనుకూలతను విశ్లేషిస్తూ, స్థల సేకరణపై స్థానిక అధికారులతో చర్చలు నిర్వహిస్తున్నారు.

    విజయవాడ డివిజన్ పరిధిలో గూడూరు-అనకాపల్లి స్టేషన్ల మధ్య మొత్తం 390 రైల్వే గేట్లు ఉన్నాయి.

    వీటికి సంబంధించి అధికారుల బృందం ఇప్పటివరకు సుమారు 100 రైల్వే గేట్లను పరిశీలించడం పూర్తిచేసినట్లు సమాచారం.

    వివరాలు 

    గత బడ్జెట్‌లో ₹2,400 కోట్లు 

    ప్రాంతీయ పరిస్థితులు, ట్రాఫిక్ రద్దీ, స్థల లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ రకమైన వంతెన నిర్మించాలి అనేది నిర్ణయిస్తారు.

    కనీసం రెండు వరుసల మార్గంతో వంతెన నిర్మాణం జరగాల్సి ఉండడంతో, అవసరమైన స్థలాన్ని సేకరించాల్సి ఉంటుంది.

    చెన్నై-గూడూరు-అనకాపల్లి రైల్వే మార్గంలో అన్ని రైల్వే గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణానికి గత బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ₹2,400 కోట్లు కేటాయించింది.

    ఇక, వచ్చే బడ్జెట్‌లో మరింత అధిక నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

    పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, ఉండి, భీమవరం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో ఉన్న రైల్వే గేట్లను విజయవాడ నుంచి వచ్చిన రైల్వే ఎస్‌ఎస్‌ఈ ఎస్‌.శ్రీనివాస్ నేతృత్వంలోని అధికారుల బృందం బుధవారం పరిశీలించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Jasprit Bumrah: బుమ్రా స్పెల్‌కి షాక్‌! ప్రాక్టీసు మ్యాచులో హడలెత్తిన బ్యాటర్లు జస్పిత్ బుమ్రా
    Toyota Fortuner: టయోటా ఫార్చ్యూనర్ ధర పెంపు.. కొనుగోలుదారులకు షాక్!  టయోటా ఫార్చ్యూనర్‌
    Balakrishna: అలాంటి చిత్రాలు, పాత్రల్లో నటించాలని ఉంది.. బాలయ్య బర్త్‌డే స్పెషల్‌ బాలకృష్ణ
    Tejas: భారత్‌ చేపట్టిన ఐదోతరం యుద్ధ విమానాలకు ఇంజిన్లు సరఫరా చేసేందుకు జీఈ ఆసక్తి  అమెరికా

    కేంద్ర ప్రభుత్వం

    Coaching Centres: కోచింగ్‌ సెంటర్లకు హెచ్చరిక.. '100 శాతం సెలెక్షన్' ప్రకటనలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇండియా
    Hallmarking Gold Rules: హాల్‌మార్కింగ్‌ లేని బంగారు ఆభరణాలను విక్రయించబోమని కేంద్రం ప్రకటన..! బిజినెస్
    PSU banks:4 PSU బ్యాంకుల్లో మైనారిటీ వాటా విక్రయానికి ప్రభుత్వం ప్లాన్ : నివేదిక బిజినెస్
    PSU banks: ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల విక్రయానికి కేంద్రం పునరాలోచన బ్యాంక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025