NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nallamala:నల్లమల అడవుల్లో భూగర్భ సొరంగం నిర్మాణం.. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు భాగంగా ప్రణాళికలు
    తదుపరి వార్తా కథనం
    Nallamala:నల్లమల అడవుల్లో భూగర్భ సొరంగం నిర్మాణం.. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు భాగంగా ప్రణాళికలు

    Nallamala:నల్లమల అడవుల్లో భూగర్భ సొరంగం నిర్మాణం.. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు భాగంగా ప్రణాళికలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 07, 2025
    10:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు భాగంగా నల్లమల అడవుల్లో భూగర్భ టన్నెల్ నిర్మాణం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

    బొల్లాపల్లి జలాశయంలో నీళ్లు నిల్వ చేసిన తర్వాత, వాటిని బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌కు తీసుకువెళ్లేందుకు నల్లమల అడవుల మీదుగా మళ్లించాల్సి ఉంటుంది.

    ఈ ప్రాజెక్టు కోసం అటవీ, పర్యావరణ అనుమతులను సులభంగా పొందడానికి, టన్నెల్‌ను భూగర్భంగా నిర్మించనున్నట్లు సమాచారం.

    ఈ టన్నెల్ ద్వారా 24 వేల క్యూసెక్కుల నీటిని తీసుకువెళ్లడానికి 118 కి.మీ పొడవునా గ్రావిటీ కాలువ తవ్వవాల్సి ఉంటుంది. ఇందులో మూడు చోట్ల నీటిని ఎత్తి తీసుకోవాల్సి ఉంటుంది.

    Details

    27 కి.మీ పొడవునా టన్నెల్ తవ్వాలని ప్రతిపాదన

    అదేవిధంగా నల్లమల అటవీ ప్రాంతంలో 27 కి.మీ పొడవునా టన్నెల్ తవ్వాలని ప్రతిపాదిస్తున్నారు.

    ఇది వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం కావడంతో అటవీ భూమిలో నీటిని ప్రవహింపజేసేందుకు ఈ టన్నెల్‌ను భూగర్భంలో నిర్మించాలనుకుంటున్నారు.

    టన్నెల్ ప్రారంభం, అవుట్‌ఫ్లో ప్రాంతం కూడా అటవీ ప్రాంతంలో కాకుండా ప్లానింగ్ చేశారు. ఈ టన్నెల్ నిర్మాణానికి 17 వేల ఎకరాల అటవీ భూమి అవసరం.

    ఇందులో 15 వేల ఎకరాలు బొల్లాపల్లి జలాశయంలో కావాలి. పోలవరం జలాశయం నుండి కృష్ణా నది వరకు నీటిని తీసుకువెళ్లే మార్గంలో ఎక్కడా ఎత్తిపోతల అవసరం లేకుండా, ప్రస్తుత కాలువల సామర్థ్యాన్ని పెంచుకోవడం మిగిలిన ప్రణాళిక.

    Details

    ఏటా 5,000 మెగావాట్ల విద్యుత్తు అవసరం

    పోలవరం కుడి కాలువ ఇప్పటికే 187 కి.మీ మేర తవ్వబడినప్పటికీ, 28 వేల క్యూసెక్కుల సామర్థ్యం కోసం దాన్ని విస్తరించాలి.

    అలాగే ఉమ్మడి పశ్చిమగోదావరి కాలువను మరో 108 కి.మీ పొడిగించి, దాని సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచే ప్రణాళిక ఉంది.

    ఈ ప్రాజెక్టు అనుమతులను సాధించడం పెద్ద కష్టంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయట.

    అటవీ భూములకు ప్రత్యామ్నాయ భూములు చూపాల్సి ఉంటే, కేంద్ర జలసంఘానికి డీపీఆర్‌ సమర్పిస్తారు.

    దరఖాస్తు ప్రకారం, ఈ ప్రాజెక్టుకు ఏటా 5,000 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుందని, దీనివల్ల ప్రాజెక్టు నిర్వహణకు రూ.వేల కోట్లు ఖర్చవుతాయని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గోదావరి నదీ

    తాజా

    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా

    గోదావరి నదీ

    గంగపుత్రుల వలలో భారీ చేప.. రూ.9 వేలకు దక్కించుకున్న మత్స్యకార దంపతులు గంగపుత్రులు
    తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ఉద్ధృత ప్రవాహం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం భద్రాచలం
    డేంజర్ బెల్స్ మోగిస్తున్న కడెం ప్రాజెక్ట్.. గేట్ల మీది నుంచి దూకుతున్న వరద  తెలంగాణ
    గోదావరి బ్రిడ్జి పైపును పట్టుకొని వేలాడిన బాలిక.. ప్రాణాలు రక్షించండి అంటూ ఫోన్! గుంటూరు జిల్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025