
#NewsBytesExplainer: 'అమరావతి వేశ్యల రాజధాని' వ్యాఖ్య కలకలం.. రాష్ట్రంలో భగ్గుమన్న నిరసనలు.. అసలేం జరిగింది?
ఈ వార్తాకథనం ఏంటి
పాత్రికేయుడు, విశ్లేషకుడు కృష్ణంరాజు సాక్షి టీవీలో జూన్ 6న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు - "అమరావతి వేశ్యల రాజధాని"గా అభివర్ణించిన మాటలు.. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విమర్శలకు దారి తీశాయి.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాల ఎదుట నిరసనలు వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల అనుబంధ మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి.
అంతేకాకుండా, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు రాష్ట్ర డీజీపీకి లేఖ రాసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు వైసీపీ అధినేత జగన్ను కూడా బాధ్యుడిగా పేర్కొన్నారు.
వివరాలు
అసలేం జరిగింది?
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం"టీవీలో ప్రసారం అయిన వ్యాఖ్యలకు తమ పార్టీకేంటి సంబంధం?" అంటూ స్పందించింది.
జూన్ 6న సాక్షి టీవీలో ప్రసారమైన చర్చా కార్యక్రమంలో "అమరావతి దేవతల రాజధాని"అనే ప్రభుత్వ ప్రచారానికి కృష్ణంరాజు వ్యతిరేకంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమాన్ని ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించారు.
చర్చలో భాగంగా వివాదస్పద వ్యాఖ్యలు
కృష్ణంరాజు: "దేవతల రాజధాని అమరావతి ఎక్కడో పైన ఉంటుంది. కానీ ఇక్కడ వేశ్యలకు రాజధానిగా మారిన అమరావతిని దేవతల రాజధాని అనటం ఏమిటి ?"
కొమ్మినేని శ్రీనివాసరావు :"అట్లా అనడం బాగోదేమో...మళ్ళీ మీ మీద పడతారు" అంటూ కాస్త సున్నితంగా నవ్వుతూనే హెచ్చరించారు.
వివరాలు
చర్చలో భాగంగా వివాదస్పద వ్యాఖ్యలు
కృష్ణంరాజు: ''ఆంధ్రప్రదేశ్'లో ఈ రోజున సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడ ఉన్నారంటే, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు''
కొమ్మినేని శ్రీనివాస రావు: ''ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో, ది హిందూలోనో వచ్చింది. అది కరెక్టే కానీ, మనం తరచూ ఆ వార్తను రిఫర్ చేస్తే అసూయ అనో, ఇంకోటో.. కృష్ణం రాజుగారు కావాలని ఇట్లా అనో అట్లా అనో సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంది''
వివరాలు
చర్చలో భాగంగా వివాదస్పద వ్యాఖ్యలు
కృష్ణంరాజు: ''"వారు నీచంగా ప్రచారం చేస్తారు అన్నది మనం అంతగా పట్టించుకోనక్కర్లేదు. కానీ అసలు వాస్తవాన్ని స్పష్టంగా చెప్పలేకపోతే, అలా చేయడం ఈ సమాజం పట్ల మనం చేసిన ద్రోహంగా మారుతుంది. అమరావతికి పరిసర ప్రాంతాల్లో వేశ్యావృత్తిని ప్రోత్సహించే దాదాపు 150 స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయని సమాచారం ఉంది. దీన్ని బట్టి సమస్య ఎటువంటి స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా, ఈ వేశ్యావృత్తి వల్ల అక్కడ ఎయిడ్స్ కేసులు కూడా అధికంగా నమోదు అవుతున్నాయని, స్వచ్ఛంద రంగంలో పనిచేస్తున్న ఒక సంస్థ ప్రతినిధి నాకు వ్యక్తిగతంగా తెలిపారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, ఇకపై అమరావతిని 'దేవతల రాజధాని'గా అభివర్ణించడం ఆపడం మంచిదని భావించాలి."
వివరాలు
చర్చలో భాగంగా వివాదస్పద వ్యాఖ్యలు
కృష్ణంరాజు: '''దేవతలు' అనే మాట వాడటంతోనే ఇంకో వివాదాస్పద విషయం చుట్టుకొస్తుంది. హిందూ దేవతలని సూచిస్తున్నారా? ముస్లిం దేవుడిని అంటున్నారా? లేక క్రైస్తవ దేవతల గురించి మాట్లాడుతున్నారా? కాబట్టి ఈ పనికిమాలిన పదాలను వాడకుండా ఉంటే మంచిది. అంతేకాదు, 'దేవతల రాజధాని' అనే పేరును పెట్టుకొని అక్కడ అక్రమాలు, అవినీతిమయమైన కార్యకలాపాలు జరగడం సరైనదా? అమరావతిలో ఎప్పటికప్పుడు అవినీతి సంబంధిత వార్తలు వస్తూనే ఉన్నాయి కదా."
ఈ చర్చ అనంతరం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రాష్ట్రంలోని మహిళలు, అన్ని పార్టీల నాయకులు తీవ్రంగా స్పందించారు.
టీడీపీ మహిళా విభాగం నాయకులు ఫిర్యాదులు చేశారు.కొన్ని ప్రాంతాల్లో సాక్షి పత్రికలు తగలబెట్టడం,వ్యాఖ్యలకారుల ఫోటోలను చెప్పులతో కొట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
వివరాలు
రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు స్పందన
ఈ వివాదంపై ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు రాష్ట్ర డీజీపీకి లేఖ రాస్తూ తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అమరావతి పరిరక్షణ సమితి, ప్రెస్ అకాడమీ ఖండనలు గుంటూరులో అమరావతి పరిరక్షణ సమితి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ మాట్లాడుతూ.. "కృష్ణంరాజు వ్యాఖ్యలు విద్వేషపూరితమైనవే. కానీ ఆ ప్రోగ్రాం నిర్వహించిన యాంకర్ కూడా ఆయన మాటలను ఖండించడం మాని ప్రోత్సహించారు" అని విమర్శించారు.
వివరాలు
టీడీపీ నేతల డిమాండ్లు
టీడీపీ నేతలు పలు ప్రెస్ కాన్ఫరెన్సులు ఏర్పాటు చేసి - జగన్, భారతి పేరుతో క్షమాపణ చెప్పాలని, సాక్షి ప్రసారాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనేక జర్నలిస్టుల సంఘాలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించాయి.
సాక్షి టీవీ స్పందన..
దీంతో సాక్షి టీవీ తన స్క్రోలింగ్లో, ప్రత్యేక కథనంలో స్పందిస్తూ - "విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు మాత్రమే. సాక్షి టీవీ వాటిని ఖండిస్తుంది. మహిళల పట్ల గౌరవం కలిగిన మా సంస్థ ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరించదు" అని చెప్పింది. ఆ కథనంలో కృష్ణంరాజు వివరణ వీడియోను కూడా ప్రసారం చేశారు.
వివరాలు
కృష్ణంరాజు వివరణ - ఉద్దేశపూర్వకం కాదు
కృష్ణంరాజు తన వివరణలో - "ఎవరినీ కించపరచే ఉద్దేశం లేదు. రాజధాని విషయంపై కామెంట్ చేసిన సందర్భంలో వచ్చిన మాటలు. ఎవరి మనోభావాలైనా గాయపరిచి ఉంటే, క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను" అని అన్నారు.
కొమ్మినేని శ్రీనివాసరావు వివరణ
కొమ్మినేని శ్రీనివాసరావు తన వీడియోలో స్పందిస్తూ - "అప్పటి చర్చలో ఒక పదం తప్పుగా దొర్లింది. కృష్ణంరాజు గారు వివరణ ఇచ్చారు. నేను వారించే ప్రయత్నం చేశాను. నా గత 18 ఏళ్ల పాత్రికేయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి భాషను అంగీకరించలేదు" అని పేర్కొన్నారు.
అయితే, ఎక్కడా బేషరతుగా క్షమాపణ చెప్పలేదు.
వివరాలు
తీవ్రంగా స్పందించిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ - "అమరావతి మహిళలను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం సహించం. ఒక మాజీ ముఖ్యమంత్రి తన మీడియా వేదికగా ఇది జరగడం మరింత బాధాకరం. బాధ్యతాయుతంగా వ్యవహరించి క్షమాపణ చెప్పాల్సింది" అని అన్నారు.
స్పందించిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "గౌతమబుద్ధుడి ఆనవాళ్లు ఉన్న నేల అమరావతిపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం హేయం. ఇది అన్ని సామాజిక వర్గాల మహిళలకూ అవమానం. బౌద్ధ ప్రాంతంగా ఉన్న అమరావతిని కించపరచడమే కాదు, చారిత్రకతను తూర్పారపర్చడమూ ఈ వ్యాఖ్యల సారాంశం" అని అన్నారు.
వివరాలు
వైసీపీ అధికారిక స్పందన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ప్రకటనలో - "కృష్ణంరాజు పార్టీకి చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేస్తూ, ఆయన అభిప్రాయాలను పార్టీ అభిప్రాయంగా మార్చి టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది" అని పేర్కొంది.
"మా పార్టీ మహిళల గౌరవాన్ని ఎప్పుడూ నిలబెట్టుకుంటుంది. మహిళలపై అసభ్య వ్యాఖ్యల్ని ఖండిస్తాం, సమర్థించం" అని తెలిపింది.
వివరాలు
అసలు ఈ సెక్స్ వర్కర్ల ప్రస్తావన ఎందుకు వచ్చింది?
చివరిగా, కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్న టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ఆధారంగా సెక్స్ వర్కర్ల అంశం చర్చలోకి వచ్చింది.
జూన్ 2న TIMES ప్రచురించిన కథనంలో, పీఎల్ఓఎస్ గ్లోబల్ హెల్త్ సంస్థ వెల్లడించిన నివేదిక ఆధారంగా - "కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మహిళా సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు" అని పేర్కొన్నారు.
"ప్రోగ్రమేటిక్ మాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ ఆఫ్ కీ పాపులేషన్ ఇన్ ఇండియా" అనే నివేదికలో ఈ వివరాలు పొందుపరిచారు.