NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manmohan Singh Memorial: మన్మోహన్ సింగ్ స్మారకానికి స్థల కేటాయింపుపై వివాదం
    తదుపరి వార్తా కథనం
    Manmohan Singh Memorial: మన్మోహన్ సింగ్ స్మారకానికి స్థల కేటాయింపుపై వివాదం

    Manmohan Singh Memorial: మన్మోహన్ సింగ్ స్మారకానికి స్థల కేటాయింపుపై వివాదం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 28, 2024
    05:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక స్థలానికి సంబంధించి వివాదం రాజుకుంటోంది.

    ఈ అంశంపై బీజేపీపై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

    నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందిస్తూ, "ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, అన్ని విభేదాలు కూడా అతనితోనే ముగిసిపోవాలన్నారు.

    కానీ ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయని, అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియల్లో ఇలాగే జరిగి ఉంటే ఎలా అనిపించేదని చెప్పారు.

    మన్మోహన్ సింగ్ స్మారక స్థలానికి స్థలం ఇప్పటికీ కేటాయించకపోవడం సరికాదన్నారు.

    Details

    బీజేపీపై తీవ్ర విమర్శలు

    ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదని, ఇది దేశ చరిత్రకు చెందిన అంశమని వ్యాఖ్యానించారు.

    ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఈ విషయంపై బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.

    ఈ విషయం గురించి మాట్లాడడం కూడా సిగ్గుచేటు అని, రాజ్‌ఘాట్ కాంప్లెక్స్‌లో డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియల కోసం స్థలం ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్నారు.

    ఇదే ప్రశ్నను ప్రధాని నరేంద్ర మోడీకి అడగాలనుకుంటున్నానని చెప్పారు. గతంలో నిగంబోధ్ ఘాట్‌లో మిగతా మాజీ ప్రధానుల అంత్యక్రియలు జరిగాయి.

    Details

    దేశ ప్రజల అభిప్రాయం

    మన్మోహన్ సింగ్ స్మారక స్థలాన్ని కూడా అదే ప్రదేశంలో ఏర్పాటు చేయాలన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ డిమాండ్ మాత్రమే కాదని, దేశ ప్రజల అభిప్రాయమని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.

    కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ ప్రతివాదన ఇచ్చింది. బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ కాంగ్రెస్ ఎప్పుడూ గాంధీ కుటుంబానికి వెలుపల ఉన్న నేతలను గౌరవించదన్నారు.

    అయితే మోడీ ప్రభుత్వం మాత్రం అన్ని పార్టీల నేతలను గౌరవిస్తుందని, కాబట్టి కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదని విమర్శించారు.

    ఈ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు ఫోన్ చేశారు.

    Details

    దేశవ్యాప్తంగా చర్చనీయాంశం

    మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం తగిన స్థలాన్ని కేటాయించాల్సిందిగా వారు కోరారు.

    ఈ పిలుపునకు హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, "అంత్యక్రియల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఉండదని, ప్రభుత్వం ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

    ఈ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం తరువాత కూడా రాజకీయం కొనసాగుతుండటం విశేషం

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మన్మోహన్ సింగ్
    కాంగ్రెస్
    బీజేపీ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    మన్మోహన్ సింగ్

    భారత్ సరైన పనే చేసింది: రష్యా-ఉక్రెయిన్ వివాదం తర్వాత కేంద్రం వైఖరికి మాజీ ప్రధాని మద్దతు   జీ20 సదస్సు
    Manmohasingh: మన్మోహన్ సింగ్ కు ముగిసిన రాజ్యసభ పదవీకాలం...హీరోగా మిగిలిపోయారన్న మల్లికార్జునఖర్గే మల్లికార్జున ఖర్గే
    Modi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Manohansingh On Modi: ప్రసంగాలతో ప్రధాని గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ: మన్మోహన్ సింగ్   నరేంద్ర మోదీ

    కాంగ్రెస్

    Congress: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. బీజేపీ నేతలు, మిత్రపక్షాలపై కాంగ్రెస్ ఫిర్యాదు దిల్లీ
    Haryana polls: వృద్ధులు, వితంతువులు,వికలాంగులకు రూ.6వేల పెన్షన్.. ఏడు గ్యారంటీలతో హర్యానాలో కాంగ్రెస్ మేనిఫెస్టో  హర్యానా
    Mallikarjuna Kharge: ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గేకు తీవ్ర అస్వస్థత.. వీడియో వైరల్  మల్లికార్జున ఖర్గే
    Congress: వేదికపైనే కాంగ్రెస్ మహిళా నేతపై వేధింపులు.. పార్టీపై తీవ్ర విమర్శలు (వీడియో) హర్యానా

    బీజేపీ

    BJP: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు 15 మంది అభ్యర్థులతో కూడిన కొత్త జాబితా విడుదల చేసిన బీజేపీ  జమ్ముకశ్మీర్
    Kangana Ranaut: కంగనా రనౌత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ  భారతదేశం
    Champai Soren: తనపై నిఘా ఉంచడంతోనే బీజేపీలో చేరా.. చంపాయ్ సోరెన్ జార్ఖండ్
    Maharashtra: మద్యం మత్తులో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కొడుకు భీభత్సం.. పలు వాహనాలను ఢీకొట్టి పరార్! మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025