NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gwalior: గ్వాలియర్‌లో ర్యాగింగ్ కలకలం.. మండే ఎండలో గంటల తరబడి మోకాళ్లపై కూర్చోపెట్టి .. 
    తదుపరి వార్తా కథనం
    Gwalior: గ్వాలియర్‌లో ర్యాగింగ్ కలకలం.. మండే ఎండలో గంటల తరబడి మోకాళ్లపై కూర్చోపెట్టి .. 
    Gwalior: గ్వాలియర్‌లో ర్యాగింగ్ కలకలం

    Gwalior: గ్వాలియర్‌లో ర్యాగింగ్ కలకలం.. మండే ఎండలో గంటల తరబడి మోకాళ్లపై కూర్చోపెట్టి .. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 21, 2024
    08:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఆయుర్వేదిక్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

    ఇక్కడ మొదటి సంవత్సరం విద్యార్థులను సీనియర్ విద్యార్థులు కొట్టి మోకాళ్ళ పైన కూర్చోబెట్టారు.

    దీనిపై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు వినిపించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

    దీంతో అందరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు.

    తమ సీనియర్లు ప్రతి రోజూ ర్యాగింగ్ పేరుతో తమని కొడుతున్నారని తెలిపారు . కాలేజీ యాజమాన్యం కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.

    సోమవారం సీనియర్లు జూనియర్ విద్యార్థులను గంటల తరబడి ఇబ్బంది పెట్టారు. దీనిపై నిరసన తెలపడంతో దారుణంగా కొట్టారు. ఈ క్రమంలో ఒక విద్యార్థి బట్టలు, బూట్లు కూడా చిరిగిపోయాయి.

    Details 

    జూనియర్ విద్యార్థుల నుంచి ఫిర్యాదు 

    దీనిపై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పరువు పోతుందనే భయంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు తెలిపారు.

    దాంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. BMS విద్యార్థి పోలీస్ స్టేషన్‌లో గాయపడిన గుర్తులు, చిరిగిన దుస్తులను కూడా చూపించాడు, దీన్ని బట్టి అతన్ని ఎంత క్రూరంగా కొట్టారో అంచనా వేయవచ్చు.

    తమ స్నేహితులను కూడా చంపేస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.

    ప్రస్తుతం ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.జూనియర్ విద్యార్థుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు.

    ర్యాగింగ్‌పై నిషేధం ఉన్నప్పటికీ,ఆయుర్వేద కళాశాలలతోపాటు కొన్ని విద్యాసంస్థలు ర్యాగింగ్‌ను కొనసాగిస్తున్నా ఆ సంస్థలోని బాధ్యులు కళ్లు మూసుకుని కూర్చున్నారు.

    మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    మధ్యప్రదేశ్

    Congress: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం 'ఇండియా'లో కూటమిలో సీట్ల పంపకంపై ఉంటుందా? ఇండియా
    Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది: మమతా బెనర్జీ  మమతా బెనర్జీ
    Kamal Nath: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి కమల్‌నాథ్‌ రాజీనామా?  కాంగ్రెస్
    BJP: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సీఎం రేసులో ఉన్న బీజేపీ నేతలు వీరే  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025