కరోనా భయాలు: దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నేపథ్యంలో ఆసుపత్రుల సంసిద్ధతను అంచనా వేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం, మంగళవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్లను ప్రకటించింది. దీంతో సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రస్తుతం మాక్ డ్రిల్ను నిర్వహిస్తున్నారు. హర్యానాలోని ఝజ్జర్లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)లో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా డ్రిల్ను పర్యవేక్షించనున్నారు. గత వారం సమీక్షా సమావేశంలో మన్సుఖ్ మాండవియా రాష్ట్ర ఆరోగ్య మంత్రులను అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధతను తనిఖీ చేయాలని కోరారు.
ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరాతో పాటు ఇతర వివరాలు సేకరణ
మాక్ డ్రిల్లో భాగంగా ఆయా రాష్ట్రాల్లో ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా, ఆస్పత్రుల్లో బెడ్లు, ఇతర క్లిష్టమైన సంరక్షణ ఏర్పాట్లను ఈ మాక్ డ్రిల్లో పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం కూడా మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. మొత్తం అన్ని రకాల వైద్య సేవలకు సంబంధించిన వివరాలను సేకరించనున్నారు. అనంతరం ఆ వివరాలను కేంద్రానికి సమర్పించనున్నారు. గత కొన్ని రోజులుగా దేశంలోని చాలా ప్రాంతాలలో కరోనా కేసులు పెరుగుతున్నందున, అనేక రాష్ట్రాలు మళ్లీ మాస్క్లను తప్పనిసరి చేశాయి, మరికొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించాయి.