NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam Terror Attack: పహల్గాం దాడి తర్వాత కౌంటర్‌ చర్యలు.. ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత 
    తదుపరి వార్తా కథనం
    Pahalgam Terror Attack: పహల్గాం దాడి తర్వాత కౌంటర్‌ చర్యలు.. ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత 
    పహల్గాం దాడి తర్వాత కౌంటర్‌ చర్యలు.. ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత

    Pahalgam Terror Attack: పహల్గాం దాడి తర్వాత కౌంటర్‌ చర్యలు.. ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 26, 2025
    09:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం జమ్ముకశ్మీర్‌ భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

    ఈ దారుణ ఘటనకు పాల్పడ్డ ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.

    లష్కరే తోయిబా ఉగ్ర సంస్థతో సంబంధాలున్న ఉగ్రవాదులు, అనుమానితుల కోసం ప్రత్యేకంగా గాలింపు కొనసాగుతోంది.

    ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులపై దాడులు జరిపిన భద్రతా బలగాలు, ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను గుర్తించి, వాటిని ధ్వంసం చేశాయి.

    Details

    ఆపరేషన్ కొనసాగుతోంది

    ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల నివాసాలను తనిఖీ చేయడంతో పాటు, వారి వద్ద నుండి సమాచారం సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

    పహల్గాం దాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్రంగా స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, భద్రతా విభాగాలు మరింత అప్రమత్తమై కదలికలు కొనసాగిస్తున్నాయి.

    ఉగ్రవాద నెట్వర్క్‌ను ఛేదించే దిశగా ఈ ఆపరేషన్‌ కొనసాగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    జమ్ముకశ్మీర్

    Jammu and Kashmir: ఏప్రిల్ 1 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇండియా
    Encounter: కుప్వారాలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం ఎన్‌కౌంటర్
    India-Pakistan: కశ్మీర్‌లో దాయాది ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయాల్సిందే.. పాకిస్థాన్‌కు భారత్‌ మరోసారి వార్నింగ్  భారతదేశం
    Vande Bharat train: కాశ్మీర్‌కు మొదటి వందేభారత్‌ రైలు.. వచ్చే నెలలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025