NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amit Shah: సైబర్‌ భద్రత లేకుండా దేశ ప్రగతి అసాధ్యం: అమిత్‌ షా
    తదుపరి వార్తా కథనం
    Amit Shah: సైబర్‌ భద్రత లేకుండా దేశ ప్రగతి అసాధ్యం: అమిత్‌ షా
    సైబర్‌ భద్రత లేకుండా దేశ ప్రగతి అసాధ్యం: అమిత్‌ షా

    Amit Shah: సైబర్‌ భద్రత లేకుండా దేశ ప్రగతి అసాధ్యం: అమిత్‌ షా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 10, 2024
    02:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సైబర్ సెక్యూరిటీ ప్రాముఖ్యత గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

    దేశ అభివృద్ధిలో సైబర్ సెక్యూరిటీ కీలక పాత్ర పోషిస్తుందని, ఈ సాంకేతికత మానవత్వానికి ఓ వరం లాంటిదని అన్నారు.

    ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14C) తొలి ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    సైబర్ నేరాలకు హద్దులు లేవని,వాటిని ఎదుర్కొనేందుకు అన్ని వర్గాలు ముందుకు రావాలని అమిత్ షా పిలుపునిచ్చారు.

    వివరాలు 

    రాబోయే ఐదేళ్లలో 5,000 సైబర్ కమాండోలు

    "సైబర్ సెక్యూరిటీ జాతీయ భద్రతలో కీలక భాగం. ప్రస్తుతం ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశంగా మారింది. సైబర్ సెక్యూరిటీ లేకుండా దేశ అభివృద్ధి సాధ్యం కాదు. అందరూ కలసి కృషి చేయాలి. ఈ సాంకేతికత మానవత్వానికి చాలా దోహదపడుతుంది, అలాగే ఆర్థిక పురోగతికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది" అని ఆయన తెలిపారు.

    సైబర్ నేరాల పెరుగుదలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సైబర్ కమాండోలను శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని షా తెలిపారు.రాబోయే ఐదేళ్లలో 5,000 సైబర్ కమాండోలను సైబర్ నేరాల నివారణ కోసం సిద్ధం చేయాలని కేంద్రం యోచిస్తోందన్నారు

    "భారతదేశంలో సైబర్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చడం ఎంతో అవసరం,ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే లావాదేవీల్లో 46శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి" అని ఆయన పేర్కొన్నారు.

    వివరాలు 

    సైబర్ నేరాలపై పోరాడేందుకు నాలుగు  ఫ్లాట్‌ఫారమ్‌లు

    ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14C) నేతృత్వంలో దేశంలో సైబర్ నేరాలపై పోరాడేందుకు నాలుగు ఫ్లాట్‌ఫారమ్‌లను అమిత్ షా ప్రారంభించారు.

    2018లో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో స్థాపించిన ఈ సెంటర్, దేశంలోని సైబర్ నేరాల సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో సమన్వయాన్ని బలపరచడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    అమిత్ షా

    Amith Shah: ఇవాళ హైదరాబాద్‌కి హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ మేనిఫెస్టో పేరు తెలుసా  తెలంగాణ
    Amit Shah: హలాల్ నిషేధంపై అమిత్ షా కీలక ప్రకటన  తెలంగాణ
    Amit Shah: నెహ్రూ తప్పిదం వల్లే POK సమస్య వచ్చింది: అమిత్ షా లోక్‌సభ
    కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..  కేంద్ర కేబినెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025