NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vallabhaneni Vamsi: ఎమ్మెల్యేగా ఉండి చట్టాన్ని పక్కనపెట్టారు.. వంశీపై న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Vallabhaneni Vamsi: ఎమ్మెల్యేగా ఉండి చట్టాన్ని పక్కనపెట్టారు.. వంశీపై న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు
    ఎమ్మెల్యేగా ఉండి చట్టాన్ని పక్కనపెట్టారు.. వంశీపై న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు

    Vallabhaneni Vamsi: ఎమ్మెల్యేగా ఉండి చట్టాన్ని పక్కనపెట్టారు.. వంశీపై న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 10, 2025
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను విజయవాడ 12వ అదనపు జిల్లా న్యాయస్థానం (ఏడీజే) ఖండించింది.

    భూవివాదంలో వంశీ చట్టవ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దశలో బెయిల్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయాధికారి భాస్కరరావు స్పష్టం చేశారు.

    ఎమ్మెల్యేగా ఉన్న వంశీ తన నియోజకవర్గ ప్రజల హక్కులను రక్షించాల్సిన బాధ్యతను విస్మరించి, వారి ఆస్తులను లాక్కోవడానికి బెదిరింపులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది.

    ఇటువంటి తీవ్రమైన ఆరోపణలున్న కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయలేమని న్యాయాధికారి తన 16 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

    ఈ కేసు విజయవాడకు చెందిన హైకోర్టు న్యాయవాది సుంకర కృష్ణమూర్తి, సీతామహాలక్ష్మి దంపతుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

    Details

    వంశీని ఏ1గా చేర్చిన పోలీసులు

    వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో, భూవివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి, తమ భూమిని తన బినామీల పేర్ల మీద రాయించుకున్నాడని వారు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి,వంశీని ఏ1గా చేర్చారు.

    వంశీ తరఫు న్యాయవాది, ఆయన ఇప్పటికే గన్నవరం స్టేషన్‌లో నమోదైన మరో కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారని, ఇప్పుడు అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ముందస్తు బెయిల్‌ కోరుతున్నారని పేర్కొన్నారు.

    పోలీసులపై అక్రమ అరెస్టు, థర్డ్‌ డిగ్రీ వాడతారన్న వంశీ వాదనను న్యాయస్థానం అసంబద్ధంగా కొట్టివేసింది.

    నూజివీడు సెషన్స్‌ కోర్టులో వంశీకి ఒక కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరైనా ఇది వేర్వేరు కేసు కాబట్టి ఆ ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.

    Details

    అసలైన సూత్రధారి వంశీనే

    వంశీ పేరును డాక్యుమెంట్లలో ఎక్కడా చూపించలేదని ఆయన తరఫు న్యాయవాది వాదించినా, అసలైన సూత్రధారి వంశీనేనని ప్రాసిక్యూషన్‌ బలమైన వాదనలు వినిపించింది.

    వంశీ అనుచరుల ద్వారా బినామీ పేర్లతో సేల్‌ డీడ్లు రాయించుకున్నారని, ఆ వ్యవహారం పూర్తిగా వెలుగులోకి రావాలంటే ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర తరఫున అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) వాదించారు.

    ఈ కేసులో ఫిర్యాదుదారు తరఫున సీనియర్‌ న్యాయవాది కిలారు బెనర్జీ, ప్రాసిక్యూషన్‌ తరఫున కల్యాణి, నిందితుడి తరఫున దేవి సత్యశ్రీ వాదనలు వినిపించారు.

    వాదనలు ముగిసిన అనంతరం గతవారం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచి, బుధవారం తుది తీర్పునిచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వల్లభనేని వంశీ
    వైసీపీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వల్లభనేని వంశీ

    టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు గన్నవరం
    Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీని వెంబడించి అరెస్టు చేసిన పోలీసులు గన్నవరం
    Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు గన్నవరం
    Vallabhaneni Vamsi: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్  భారతదేశం

    వైసీపీ

    Kapu Reservation: కాపుల రిజర్వేషన్‌ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ చంద్రబాబు నాయుడు
    Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా విజయసాయిరెడ్డి
    Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్  భారతదేశం
    Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్‌.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025