NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం
    తదుపరి వార్తా కథనం
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; 1,050 మెగావాట్ల థర్మల్, 250 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఆమోదం

    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం

    వ్రాసిన వారు Stalin
    Apr 06, 2023
    05:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రాబోయే రోజుల్లో 1,050మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. థర్మల్‌, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై జరిగిన సమీక్ష సమావేశంలో సింగరేణి కంపెనీ సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

    ప్రతిపాదిత థర్మల్‌ పవర్‌ ప్లాంట్లతో కలిసి కంపెనీ విద్యుత్ సామర్థ్యం 3,350 మెగావాట్లకు చేరుకుంటుందని శ్రీధర్‌ వెల్లడించారు. నెల రోజుల్లోగా ప్రతిపాదిత పవర్‌ ప్లాంట్లకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

    జైపూర్‌లో దాదాపు 2వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన 1,200 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రాంగణంలో 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపిందని ఎన్‌.శ్రీధర్‌ పేర్కొన్నారు.

    సింగరేణి

    భూపాలపల్లి, మందమర్రి, మణుగూరంలో సోలార్ ప్లాంట్లు

    800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని శ్రీధర్‌ తెలిపారు. ఈ ప్లాంట్‌ పూర్తయితే సింగరేణి థర్మల్‌ పవర్‌ 2000 మెగావాట్లకు చేరుకుంటుందని చెప్పారు.

    ప్రస్తుతం సింగరేణి నిర్వహిస్తున్న 1,200 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ద్వారా సంస్థకు ఏటా దాదాపు రూ.500 కోట్ల ఆదాయం సమకూరుతున్నట్లు వివరించారు. తద్వారా సంస్థ ప్రగతికి దోహదపడుతుందన్నారు.

    భూపాలపల్లి, మందమర్రి, మణుగూరు గని ప్రాంతంలో 250 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో సింగరేణి సంస్థ ద్వారా ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్ 550 మెగావాట్లు అవుతుందని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    జైపూర్
    విద్యుత్
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తెలంగాణ

    తెలంగాణలోని 18జిల్లాల్లో వర్షాలు; ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ ఐఎండీ
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎమ్మెల్సీ
    మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత; సీఎం కేసీఆర్ సంతాపం తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    మహిళా రిజర్వేషన్ బిల్లు: రేపు కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం కల్వకుంట్ల కవిత

    జైపూర్

    భారతదేశంలో OXO మోడల్‌ బైక్ ను ప్రారంభించిన స్వదేశీ సంస్థ HOP ఆటో మొబైల్
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం

    విద్యుత్

    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    తాజా వార్తలు

    ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన నేతల జాబితాలో ప్రధాని మోదీ నెంబర్ 1 నరేంద్ర మోదీ
    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీకి వాయిదా రాహుల్ గాంధీ
    'వంటగ్యాస్ ధరను తగ్గించాలి'; ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ నిర్మలా సీతారామన్
    దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17వరకు పొడిగింపు మనీష్ సిసోడియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025