NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mysuru: మైసూర్ ప్యాలెస్‌లో ప్రారంభమైన దసరా ఉత్సవాలు.. ప్రైవేట్ దర్బార్ నిర్వహించిన యదువీర్
    తదుపరి వార్తా కథనం
    Mysuru: మైసూర్ ప్యాలెస్‌లో ప్రారంభమైన దసరా ఉత్సవాలు.. ప్రైవేట్ దర్బార్ నిర్వహించిన యదువీర్
    మైసూర్ ప్యాలెస్‌లో ప్రారంభమైన దసరా ఉత్సవాలు

    Mysuru: మైసూర్ ప్యాలెస్‌లో ప్రారంభమైన దసరా ఉత్సవాలు.. ప్రైవేట్ దర్బార్ నిర్వహించిన యదువీర్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 04, 2024
    01:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విఖ్యాత దసరా ఉత్సవాల సందర్భంగా రాజవంశాధికారి యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయరు రత్నఖచిత సింహాసనాన్ని అధిష్ఠించి గురువారం జరిగిన ప్రైవేటు దర్బారు ఘట్టం అద్భుతంగా సాగింది.

    ఇది వరుసగా పదో ఏడాది ఆయన దర్బారు నిర్వహించడం. ఈసారి, మైసూరు-కొడగు ఎంపీగా తొలిసారి పూజల్లో పాల్గొన్నారు.

    రాజమాత ప్రమోదాదేవి ఆశీర్వాదాలు తీసుకున్న యదువీర్, వందిమాగధుల నినాదాల నడుమ ప్యాలెస్‌లోకి అడుగుపెట్టారు.

    ఆయన లేత నేరేడు రంగు మైసూరు తలపాగా,పట్టు కుర్తా, పైజామాతో పాటు వంశపారంపర్యంగా వచ్చిన ముత్యాలు,మణులతో పొదిగిన ఆభరణాలు ధరించారు.

    ఉదయం 11.35కి ప్యాలెస్‌ ఆవరణలోకి చేరుకున్న యదువీర్,12.05 వరకు పూజలు నిర్వహించి రత్నఖచిత సింహాసనాన్ని అధిష్ఠించారు.

    దర్బార్ హాల్‌లో నవగ్రహ పూజలు,సింహం ముఖ లాంఛనం,కలశాలకు పూలు, అక్షితలు చల్లుతూ మంగళహారతి నిర్వహించారు.

    వివరాలు 

    విజయదశమి వరకు యదువీర్  ప్రైవేటు దర్బారు 

    సింహాసనం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత దాన్ని అధిరోహించి, సిబ్బందుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

    ఈ సమయంలో కర్ణాటక పోలీసు బ్యాండ్ సిబ్బంది 'కాయో శ్రీ గౌరీ' గీతాన్ని వాయించగా, అనంతరం శ్రీమహాగణపతీం, చాముండేశ్వరి వంటి భక్తి గీతాలు కూడా ఆలపించారు.

    యదువీర్ సుమారు అరగంట సింహాసనంపై కూర్చుని ప్రైవేటు దర్బారును నిర్వహించారు.

    పరకాల మఠం, చాముండి బెట్ట, శ్రీరంగపట్టణ వంటి ప్రముఖ దేవాలయాల నుంచి వచ్చిన ప్రసాదాన్ని స్వీకరించారు.

    దర్బారు ముగింపు సందర్భంగా సహకారం అందించిన వారికి యదువీర్ చిరు కానుకలను అందించారు.

    విజయదశమి వరకు యదువీర్ ప్రతిరోజూ కొంత సమయం ప్రైవేటు దర్బారును నిర్వహిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్
    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్
    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప

    కర్ణాటక

    Lok Sabha Elections 2024: యానిమేటెడ్ క్లిప్‌ వివాదం.. జేపీ నడ్డా, అమిత్ మాల్వియాపై కేసు నమోదు  జేపీ నడ్డా
    Karnataka Sex Scandal: కర్ణాటక సెక్స్ స్కాండల్‌లో ట్విస్ట్.. తప్పుడు కేసు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్న మహిళ  భారతదేశం
    Engagement Off: నిశ్చితార్థం ఆగిందన్న కోపంతో.. అమ్మాయి తల నరికిన వ్యక్తి.. భారతదేశం
    Prajwal Revanna: రేవన్న కేసులో పోలీసుల అదుపులో బిజెపి నేత  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025