NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు
    తదుపరి వార్తా కథనం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు
    మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 31, 2025
    04:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మావోయిస్టుల నిర్మూలనదిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టుల నుంచి పూర్తిగా స్వేచ్ఛ చేయాలన్నదే లక్ష్యంగా 'ఆపరేషన్‌ కగార్‌'ను ప్రారంభించింది.

    ఈ ఆపరేషన్‌ 2023 నుంచే వేగంగా అమలవుతోంది. ఈ ప్రక్రియలో మావోయిస్టుల ప్రధాన నేతలను భద్రతా బలగాలు ఒకొక్కరిగా మట్టుబెడుతున్నాయి.

    ఇటీవల మావోయిస్టుల నుంచి ఓ లేఖ వెలుగులోకి వచ్చింది.

    కేంద్ర కమిటీ తరఫున అభయ పేరిట విడుదలైన ఈ లేఖలో మే 21న మృతి చెందిన తమ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు.

    ఛత్తీస్‌ఘడ్‌లోని అబూజ్‌మడ్‌ అడవులు గతంలో మావోయిస్టులకు బలమైన స్థావరాలుగా ఉన్నప్పటికీ,అక్కడికి భద్రతా బలగాలు అడుగుపెడుతూ తమ దౌత్యాన్ని విస్తరిస్తున్నాయి.

    Details

    పదుల సంఖ్యలో హతమవుతున్న మావోయిస్టులు

    ఆధునిక సాంకేతికతతో మావోయిస్టులను వెదుకుతూ, వరుస ఎన్‌కౌంటర్లు నిర్వహిస్తున్నారు. దాంతో మావోయిస్టులు పదుల సంఖ్యలో హతమవుతుండగా, కొంతమంది జవాన్లు కూడా ప్రాణత్యాగాలు చేస్తున్నారు.

    తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా అడవుల్లో భద్రతా బలగాలు మే 21న నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు (70) మృతి చెందారు.

    కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

    ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 27 మంది మావోయిస్టులు హతమయ్యారని, వారిలో నంబాల కేశవరావు కూడా ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. అతనిపై రూ.1.5 కోట్లు బహుమతి కూడా ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం
    Fat burning: వేగంగా బరువు తగ్గాలంటే.. ఉదయం ఈ 5 అలవాట్లు పాటించండి జీవనశైలి
    Gujarat Titans: గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ  గుజరాత్ టైటాన్స్
    Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు

    కేంద్ర ప్రభుత్వం

    Delhi Airport: కేంద్రంపై దిల్లీ విమానాశ్రయం దావా.. హిండన్ ఎయిర్‌బేస్ వివాదం! దిల్లీ
    PM Modi: ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258 కోట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం భారతదేశం
    MPs Salaries Hike: ఎంపీల వేతనాలు, పెన్షన్, అలవెన్సుల పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు భారతదేశం
    Pension For Gig Workers: గిగ్‌ వర్కర్లకు పెన్షన్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! జొమాటో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025