NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Air Pollution: గ్రాఫ్ 3 అమలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఏవి నిషేధించారంటే?
    తదుపరి వార్తా కథనం
    Delhi Air Pollution: గ్రాఫ్ 3 అమలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఏవి నిషేధించారంటే?
    గ్రాఫ్ 3 అమలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఏవి నిషేధించారంటే?

    Delhi Air Pollution: గ్రాఫ్ 3 అమలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఏవి నిషేధించారంటే?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 15, 2024
    10:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజధాని దిల్లీలో గాలి నాణ్యత ప్రస్తుతం అత్యంత క్షీణ స్థాయిలో ఉంది. గురువారం,ఢిల్లీలో ఏక్యూఐ స్థాయి 400 దాటింది, ఇది తీవ్ర కాలుష్యాన్ని సూచిస్తుంది.

    ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని,ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (AQMC)నవంబర్ 15 నుండి గ్రాప్-3 నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది.

    గ్రాప్-3 ప్రకారం,కాలుష్యం క్రమంగా తగ్గే వరకు నిర్మాణ పనులు నిలిపేస్తారు. భవనాల కూల్చివేతలు, మైనింగ్,ఇతర సంబంధిత కార్యకలాపాలు కూడా నిలిపివేయాలని నిర్ణయించారు.

    అదేవిధంగా, ప్రాథమిక పాఠశాలలలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

    గత రెండు రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా మారింది.దీనితో పాటు, గురువారం ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ వార్ రూమ్‌లో పర్యావరణ శాస్త్రవేత్తలతో చర్చలు జరిపింది.

    వివరాలు 

    ఢిల్లీ గాలి పీల్చడం ఆరోగ్యానికి ప్రమాదకరం

    ఈ సందర్భంగా,పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్,కాలుష్యాన్ని నియంత్రించేందుకు తీసుకునే చర్యలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

    పంజాబ్, హర్యానా ప్రాంతాలలో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఉత్పన్నమయ్యే పొగ దృష్ట్యా,ఢిల్లీకి గాలి కాలుష్యం మరింత పెరిగింది.

    ఈ పొగ, ఢిల్లీ నగరాన్ని గ్యాస్ ఛాంబర్‌కు సమానం చేసినట్లుగా మారింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) తాజా డేటా ప్రకారం, ఢిల్లీలో సగటు ఏక్యూఐ 452కి చేరింది.

    సైన్స్ మ్యాగజైన్ "లాన్సెట్ న్యూరాలజీ"జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనంలోని వివరాల ప్రకారం,వాయు కాలుష్యం మూలంగా సబ్-రాక్నోయిడ్ హెమరేజ్(బ్రెయిన్ స్ట్రోక్)కేసులు పెరిగిపోతున్నాయని వెల్లడైంది.

    తీవ్ర గాలి కాలుష్యం అనేక సందర్భాల్లో అంగ వైకల్యాన్ని,గుండె వైఫల్యాన్ని కలిగించే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దిల్లీ

    Delhi CM Atishi: అతిషి నేతృత్వంలో దిల్లీలో రోడ్ల పరిశీలన.. దీపావళిలోగా గుంతల రహిత రోడ్లు! అతిషి మార్లెనా
    PM E-DRIVE: పీఎం ఇ- డ్రైవ్‌ పథకం ద్వారా టూ వీలర్‌కు గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం
    Cocaine Seized: దిల్లీలో కలకలం రేపిన డ్రగ్స్.. రూ.2వేల కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం ఇండియా
    Delhi: ఢిల్లీలోని జైత్‌పూర్‌లో దారుణ ఘటన.. వైద్యుడిని కాల్చిచంపిన ఇద్దరు మైనర్లు.. హత్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025