
Delhi BJP chief : యమునా నదిలో దిల్లీ బీజేపీ అధ్యక్షుడు స్నానం.. శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిక
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీ కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో యమునా నదిలో గురువారం దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా నిరసనగా స్నానమాచరించారు.
2025 నాటికి యమునా నదిని శుద్ధి చేస్తామని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
నది శుభ్రత కోసం కేటాయించిన నిధులను ఆప్ ప్రభుత్వం దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడిందని వీరేంద్ర ఆరోపించారు.
నిరసనగా ఐటీఓ సమీపంలోని యమునా ఘాట్లోని కాలుష్య నీటిలో తలను ముంచుతూ నిరసన తెలిపారు. కాలుష్య నదిలో స్నానంచేయడం వల్ల వీరేంద్ర సచ్దేవా అస్వస్థతకు గురయ్యారు.
Details
యమునా కాలుష్యానికి బీజేపీ కూడా కారణమే
శ్వాసకోశ సమస్యలు, చర్మ దురద సమస్యలతో ఆయన రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు.
దీనిపై దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ స్పందిచారు. యమునా కాలుష్యానికి బీజేపీ ప్రభుత్వాలు కూడా కారణమని అన్నారు.
ఉత్తర ప్రదేశ్, హర్యానాలోని పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయని, ఇది బీజేపీ ఎత్తుగడ అని గోపాల్ రాయ్ పేర్కొన్నారు.
Embed
యమునా నదిలో స్నానం చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు
BJP Delhi state president Virendra Sachdeva admitted in hospital 48 after taking a dip in Yamuna, was suffering from rashes and itching pic.twitter.com/dugICEyT9n— Social News Daily (@SocialNewsDail2) October 26, 2024