NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలిని పీల్చిన ఢిల్లీ వాసులు.. నివేదిక 
    తదుపరి వార్తా కథనం
    Delhi: 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలిని పీల్చిన ఢిల్లీ వాసులు.. నివేదిక 
    128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలిని పీల్చిన ఢిల్లీ వాసులు

    Delhi: 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలిని పీల్చిన ఢిల్లీ వాసులు.. నివేదిక 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2024
    09:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది ప్రథమార్థంలో దిల్లీ ప్రజలు మొత్తం 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలి పీల్చారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ప్రకటించిన నివేదిక తెలియజేస్తోంది.

    ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) సమర్పించిన ఈ నివేదిక 2024 జనవరి నుండి జూలై వరకు ఢిల్లీలో గాలి నాణ్యతను ట్రాక్ చేసింది.

    నివేదిక ప్రకారం,ఈ కాలంలో 128 రోజులు గాలి స్వచ్ఛంగా ఉండగా, ఆగస్టు 1 నుండి ఆగస్టు 20 వరకు మరో 20 రోజులు గాలి నాణ్యత స్వచ్ఛంగా ఉందని పేర్కొంది.

    గాలి నాణ్యత సంతృప్తికర స్థాయిలో 159 రోజులు ఉండగా, 2023లో ఈ సంఖ్య 206 రోజులకు చేరింది.

    వివరాలు 

    కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు

    కాగా, వాహనాల ఉద్గారాలు,పారిశ్రామిక ధూమ్రాలు,బహిరంగ దహనం వంటి వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలని నివేదిక గుర్తించింది.

    ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను కూడా నివేదికలో ప్రస్తావించారు.

    రవాణా శాఖ,ట్రాఫిక్ పోలీసులతో కలిసి 385ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేసి, జనవరి 1 నుండి జూలై 15 వరకు 308కాలుష్యకార వాహనాలను సీజ్ చేశారు.

    త్వరలో,ఢిల్లీ ప్రభుత్వం 3,267ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోందని నివేదిక తెలిపింది.

    అక్టోబర్ 2023 నుండి జూలై 2024 వరకు బహిరంగంగా బయోమాస్ కాల్చకుండా నిరోధించేందుకు 338 పెట్రోలింగ్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు.

    ఈ బృందాలు 65,000స్థలాలలో తనిఖీలు జరిపి,550చలాన్లు జారీ చేయడంతో పాటు రూ.6.85లక్షల జరిమానా వసూలు చేశాయని నివేదిక వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    దిల్లీ

    Swati Maliwal Assault Case: బిభవ్ కుమార్ పిటిషన్‌పై పోలీసులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు  భారతదేశం
    Air pollution: దేశంలోని 10 నగరాల్లో ఏడు శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణం, అగ్రస్థానంలో ఏ రాష్ట్రం ఉందో తెలుసా?  వాయు కాలుష్యం
    Delhi: ఢిల్లీలో కిడ్నీ రాకెట్ మఠా గుట్టు రట్టు..డాక్టర్ తో సహా 7గురు అరెస్ట్   భారతదేశం
    Delhi: భజన్‌పురాలో జిమ్ యజమాని దారుణహత్య  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025