NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ ఎన్నిక
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Delhi: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ ఎన్నిక

    Delhi: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ ఎన్నిక

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 24, 2025
    11:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 27 సంవత్సరాల విరామం తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వచ్చింది.

    రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, ఈ హోదాలో తొలిసారి అసెంబ్లీలో ప్రవేశించారు.

    మరోవైపు, ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ సింగ్ లవ్లీ ఎన్నికయ్యారు.

    లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాజ్ నివాస్‌లో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు.

    తర్వాత,మొదటగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయగా,ఆ తరువాత ఢిల్లీ కేబినెట్ మంత్రులుగా పర్వేష్ సాహిబ్ సింగ్,ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా,రవీందర్ ఇంద్రజ్ సింగ్ లు ప్రమాణం చేశారు.

    మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు.

    వివరాలు 

    ప్రతిపక్ష నాయకురాలిగా అతిషి ఎంపిక 

    ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతిషి ఎన్నికయ్యారు.

    అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను గౌరవిస్తామని, వారి తరఫున బాధ్యతగా నిలుస్తామని చెప్పారు.

    ప్రధాని నరేంద్ర మోదీ తొలి కేబినెట్ సమావేశంలోనే మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయ పథకాన్ని అమలు చేయాలని ప్రకటించారని, దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు.

    ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆప్ ఎమ్మెల్యేలు కృషి చేస్తారని గుర్తుచేశారు.

    గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని బీజేపీ నిరూపించే ప్రయత్నం చేస్తోందని, అయితే అలాంటి ఆరోపణలను తిప్పికొడతామని అతిషి స్పష్టం చేశారు.

    వివరాలు 

    బీజేపీకి స్పష్టమైన మెజారిటీ 

    ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా, బీజేపీ 48 స్థానాలు గెలుచుకుని పూర్తి ఆధిపత్యం కనబరిచింది.

    ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితమైంది. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం గమనార్హం.

    ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి ప్రముఖ ఆప్ నేతలు ఓటమిపాలయ్యారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రమాణ స్వీకారం చేయిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ 

    #WATCH | BJP MLA Arvinder Singh Lovely takes oath as the Delhi Assembly Protem Speaker at Raj Niwas. The oath is being administered by LG VK Saxena

    The first session of the Delhi Assembly is going to start from today. pic.twitter.com/cDDwkDrK3U

    — ANI (@ANI) February 24, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    దిల్లీ

    Arvind Kejriwal: బీజేపీ గెలిస్తే ఢిల్లీలో అన్ని సేవలు ఆగిపోతాయి.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు అరవింద్ కేజ్రీవాల్
    Delhi assembly elections: దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం  భారతదేశం
    Delhi elections: మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఆప్ ఎమ్యెల్యే దినేష్ మొహానియా.. కేసు నమోదు  ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    Delhi Exit Polls: దిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025