
Attack on Delhi CM: దిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి.. అదపులో నిందితుడు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. సివిల్ లైన్స్లోని ఆమె అధికారిక నివాసంలో 'జన్ సున్వాయ్' కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సుమారు 35 ఏళ్ల వయసు కలిగిన ఒక వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. మొదట అతడు కొన్ని పత్రాలను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం,దాడి చేసినట్లు తెలిసింది. ఈ సంఘటనపై స్పందించిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి
Cops nab man for attack on CM Rekha Gupta, taken to Civil Lines police station.
— IndiaToday (@IndiaToday) August 20, 2025
AAP Leader @anuragdhanda says "We condemn the attack".
Delhi Minister @mssirsa reacts to the incident. #DelhiCM #RekhaGupta #JanSunvai #BJP #ITVideo #TheBurningQuestion | @Sriya_Kundu pic.twitter.com/Z61TonMLww