NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rahul Gandhi :ఢిల్లీ ఎయిమ్స్‌లో రోగులను కలిసిన రాహుల్ గాంధీ.. ఆప్ ప్రభుత్వం పై విమర్శలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rahul Gandhi :ఢిల్లీ ఎయిమ్స్‌లో రోగులను కలిసిన రాహుల్ గాంధీ.. ఆప్ ప్రభుత్వం పై విమర్శలు
    ఢిల్లీ ఎయిమ్స్‌లో రోగులను కలిసిన రాహుల్ గాంధీ.. ఆప్ ప్రభుత్వం పై విమర్శలు

    Rahul Gandhi :ఢిల్లీ ఎయిమ్స్‌లో రోగులను కలిసిన రాహుల్ గాంధీ.. ఆప్ ప్రభుత్వం పై విమర్శలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 17, 2025
    01:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వస్తున్నారు.

    శీతాకాలంలో దేశ రాజధానిలో పరిస్థితి మరింత దిగజారుతోంది. తగిన ఏర్పాట్లు లేకపోవడం వల్ల రోగులు, వారి కుటుంబ సభ్యులు బహిరంగ ప్రదేశాల్లో చలిని తట్టుకోవాల్సి వస్తోంది.

    ఈ సమస్యల నేపథ్యంలో, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ వెలుపల రోగులను కలుసుకున్నారు.

    అక్కడ రాహుల్ రోగుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అంతేకాక, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

    కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు రోగుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యంపై రాహుల్ తీవ్రంగా విమర్శలు చేశారు.

    వివరాలు 

     రోగులతో మాట్లాడిన రాహుల్ 

    ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ రాత్రిళ్లు ఫుట్‌పాత్‌లు,సబ్‌వేలపై పడుకున్న అనేక మంది రోగులతో రాహుల్ మాట్లాడారు.

    ఈ సందర్భానికి సంబంధించిన చిత్రాలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

    "వ్యాధుల భారంతో,తీవ్రమైన చలి ప్రభావంతో,ప్రభుత్వ నిర్లక్ష్య మధ్య,నేను ఎయిమ్స్ వెలుపల రోగులను, వారి కుటుంబాలను కలిశాను.వారు దూర ప్రాంతాల నుండి వైద్యం కోసం వచ్చారు. కానీ, చికిత్స కోసం ఎదురు చూస్తూ రోడ్ల మీద, ఫుట్‌పాత్‌లపై, సబ్‌వేలపై పడుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది," అని రాహుల్ అన్నారు. "చల్లని నేల మీద ఆకలి, అసౌకర్యాల మధ్య ఉన్నా, మేము ఆశను కోల్పోకుండా ఎదురుచూస్తున్నాము. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు ప్రజల పట్ల తమ బాధ్యతలు నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యాయి," అని రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

    వివరాలు 

    ఢిల్లీలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన కెవెంటర్స్ స్టోర్‌ను సందర్శించిన రాహుల్ 

    సోషల్ మీడియాలో రాహుల్ ఒక ఫోటోను పంచుకున్నారు, అందులో అనేక మంది రోగులు నేలపై పడుకున్నట్లు కనిపిస్తున్నారు.

    రాహుల్ రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను విన్నారు.

    అంతేకాదు, రోగుల మందుల ప్రిస్క్రిప్షన్లను తీసుకుని అవసరమైన సమాచారాన్ని సేకరించారు.

    రాహుల్ గాంధీ సాధారణ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి తరచూ ఇలాంటి ప్రదేశాలను సందర్శిస్తున్నారు.

    ఇటీవల, రాహుల్ ఢిల్లీలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన కెవెంటర్స్ స్టోర్‌ను సందర్శించి, అక్కడి సిబ్బందితో, ప్రజలతో మాట్లాడారు.

    అంతకుముందు, జనవరి 14న రాహుల్ ఢిల్లీలో ఒక సందర్శన చేసిన వీడియోను షేర్ చేశారు.

    ఈ సందర్శనలు ఢిల్లీ ఎన్నికలతో సంబంధం ఉందని, దీని ద్వారా రాహుల్ ఢిల్లీ ప్రజలతో దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    రాహుల్ గాంధీ

    Dhankhar: రాహుల్ గాంధీపై ఉపరాష్ట్రపతి ధన్కర్ మండిపాటు జగదీప్ ధన్కర్
    Ravneetsingh Bittu: రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్.. ఆయన తలపై కేంద్రం రివార్డు ప్రకటించాలి : కేంద్ర మంత్రి కాంగ్రెస్
    Sanjay Gaikwad: రాహుల్‌ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షలిస్తా.. శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు  శివసేన
    Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025