NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MLC Kavitha: కవితకు షాక్.. సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి
    తదుపరి వార్తా కథనం
    MLC Kavitha: కవితకు షాక్.. సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి
    MLC Kavitha: కవితకు షాక్.. సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి

    MLC Kavitha: కవితకు షాక్.. సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 12, 2024
    05:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది.

    సీబీఐ అభ్యర్థన మేరకు రూస్ అవెన్యూ కోర్టు ఈనెల 15 ఉదయం గం.10.00 వరకు కవితకు సీబీఐ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

    అంతేకాకుండా, కవితను సీబీఐ కస్టడీలో కలిసేందుకు కేటీఆర్,సంతోష్,భర్త అనిల్,కవిత పిల్లలు, తల్లి,పీఏ కలిసేందుకు అనుమతిని కూడా కోర్టు ఇచ్చింది.

    సాయంత్రం 6గంటల నుంచి 7గంటల వరకు కలిసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది.

    ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది.

    నేరపూరిత కుట్ర, ఖాతాలను తారుమారు చేయడంతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద కవితను సీబీఐ అదుపులోకి తీసుకుంది.

    Details 

    లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి

    5 రోజుల రిమాండ్‌ ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరగా .. కోర్టు మూడు రోజుల కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    కోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ న్యాయవాది మాట్లాడుతూ.. లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారిగా తెలిపారు.

    ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల లంచం అందజేయడంలో కవిత పెద్ద పాత్ర పోషించారని అన్నారు.

    ఆమె ప్రధాన కుట్రదారులలో ఒకరిని.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఒక బడా వ్యాపారవేత్త కలవగా, ఎక్సైజ్ పాలసీ ద్వారా మద్దతు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.

    ఈ కేసుకు సంబంధించి పలువురు నిందితుల వాంగ్మూలాలను నమోదు చేశారు. హోటల్ తాజ్‌లో సమావేశం జరిగిందని లాయర్ తెలిపారు.

    Details 

    డబ్బు సమకూర్చడంలో కవిత పాత్ర సూత్రధారి: సీబీఐ 

    కవిత హైదరాబాద్‌లో వ్యాపారవేత్తను కలిశారని సిబిఐ తెలిపింది. విజయ్ నాయర్ కవితతో టచ్ లో ఉన్నారు.

    100 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని బీఆర్‌ఎస్ నాయకురాలు వ్యాపారవేత్తను కోరారు. ఈ డబ్బును సమకూర్చడంలో కవిత పాత్ర చాలా పెద్దది.

    గోవా ఎన్నికల కోసం హవాలా ద్వారా డబ్బు వసూలు చేసినట్లు సీబీఐ పేర్కొంది. వాట్సాప్ సంభాషణలు కూడా ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.

    ఇక ఆప్ నేతలకు సౌత్‌ గ్రూప్ ద్వారా రూ.100 ముడుపులు ఇచ్చినట్లుగా గుర్తించారు. కవిత సూచన మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ. 25 కోట్లు అందజేశారు.

    ఈ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సీబీఐ కోర్టుకు సమర్పించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల కవిత

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    కల్వకుంట్ల కవిత

    ఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    నేడు మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు
    తెలంగాణలో మళ్ళీ మొదలైన పోస్టర్ల గొడవ, ఈసారి బీఎల్ సంతోష్ పై బీఆర్ఎస్ గురి తెలంగాణ
    చివరి నిమిషంలో కవిత ట్విస్ట్; విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025