NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: ఢిల్లీలో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులఫై భౌతిక దాడి..!
    తదుపరి వార్తా కథనం
    Delhi: ఢిల్లీలో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులఫై భౌతిక దాడి..!
    ఢిల్లీలో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులఫై భౌతిక దాడి..!

    Delhi: ఢిల్లీలో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులఫై భౌతిక దాడి..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    11:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈడీ (ED) అధికారులు సోదాలు చేపట్టేటప్పుడు అనూహ్య సంఘటన ఎదురైంది.

    కొన్ని గుర్తుతెలియని దుండగులు సోదాలు జరుపుతున్న అధికారులపై దాడికి దిగారు.

    ఈ ఘటన ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఈడీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

    ఈడీ (ED)లోని హై-ఇంటెన్సిటీ యూనిట్ (HIU) అధికారులు దేశవ్యాప్తంగా ఉన్న సైబర్‌క్రైమ్ నెట్‌వర్క్‌లకు సంబంధించి ఛార్టెడ్ అకౌంటెంట్స్‌పై సోదాలు నిర్వహిస్తున్నారు.

    ఈ క్రమంలో, దిల్లీలోని బిజ్వాసన్‌ ప్రాంతంలోని ఓ ఫామ్‌ హౌస్‌లో సోదాలు చేస్తున్నప్పుడు ఐదుగురు దుండగులు అధికారులపై ఫర్నీచర్‌తో దాడికి దిగారు.

    వివరాలు 

    ఘటనపై అధికారులు కేసు నమోదు

    ఈ దాడిలో ఈడీ అదనపు డైరెక్టర్‌ గాయపడ్డారు. దుండగులు ఘటనా స్థలాన్ని వదిలి పారిపోయారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    ఈ సోదాలు క్యూఆర్ కోడ్, పిషింగ్, పార్ట్‌టైమ్ జాబ్స్ వంటి స్కామ్స్‌తో సంబంధం కలిగి ఉన్న వేలాది సైబర్ క్రైమ్‌ల నుండి అక్రమ నిధులను వెలికితీయడంపై దృష్టి పెట్టినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    దిల్లీ

    Delhi Air Quality: ఢిల్లీలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. దారుణంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ భారతదేశం
    VK Saxena: చెట్ల నరికివేతకు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలనే విషయం.. నాకు తెలీదు: సుప్రీంకోర్టుకు ఎల్జీ సమాధానం సుప్రీంకోర్టు
    Aravind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్‌ వసతిపై హైకోర్టు నోటీసులు.. నవంబర్ 26న విచారణ అరవింద్ కేజ్రీవాల్
    Delhi BJP chief : యమునా నదిలో దిల్లీ బీజేపీ అధ్యక్షుడు స్నానం.. శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిక బీజేపీ

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    Rajasthan: పేపర్ లీక్ కేసులో రాజస్థాన్ పీసీసీ చీఫ్ కుమారులకు సమన్లు రాజస్థాన్
    Rajasthan: లంచం ఆరోపణలపై ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్   రాజస్థాన్
    రాజస్థాన్‌: జల్ జీవన్ మిషన్ లింక్ మనీ లాండరింగ్ కేసులో 25 చోట్ల దాడులు రాజస్థాన్
    Delhi: హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025