NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: ఢిల్లీ నీటి సంక్షోభం.. సుప్రీంకి కేజ్రీవాల్ ప్రభుత్వం.. మూడు రాష్ట్రాల నుండి అదనపు నీటిని డిమాండ్ 
    తదుపరి వార్తా కథనం
    Delhi: ఢిల్లీ నీటి సంక్షోభం.. సుప్రీంకి కేజ్రీవాల్ ప్రభుత్వం.. మూడు రాష్ట్రాల నుండి అదనపు నీటిని డిమాండ్ 
    ఢిల్లీ నీటి సంక్షోభం.. సుప్రీంకి కేజ్రీవాల్ ప్రభుత్వం

    Delhi: ఢిల్లీ నీటి సంక్షోభం.. సుప్రీంకి కేజ్రీవాల్ ప్రభుత్వం.. మూడు రాష్ట్రాల నుండి అదనపు నీటిని డిమాండ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 31, 2024
    12:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో వేడిగాలుల మధ్య తలెత్తుతున్న నీటి సంక్షోభంపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

    నీటి సమస్యకు సంబంధించి ఢిల్లీలోని హర్యానా, యూపీ, హిమాచల్‌ప్రదేశ్‌ల నుంచి ఒక నెల పాటు అదనంగా నీటిని అందించాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

    పెరుగుతున్న నీటి సంక్షోభం దృష్ట్యా, ఢిల్లీ ప్రభుత్వం కార్ వాష్‌లు, నిర్మాణ స్థలాల వద్ద త్రాగునీటి వాడకంపై నిషేధంతో సహా అనేక అత్యవసర చర్యలను ప్రకటించింది.

    ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం నీటిని వృధా చేస్తే రూ.2,000 జరిమానా విధించింది. జరిమానాను అమలు చేయడానికి 200 బృందాలను ఏర్పాటు చేసింది.

    Details 

    ట్యాంకర్లు ఎక్కి నీటిని నింపుకునే పరిస్థితి

    చాణక్యపురిలోని సంజయ్ క్యాంపు వద్ద ట్యాంకర్ల నుంచి నీటిని నింపుకునేందుకు ప్రజలు ఫుట్‌పాత్‌లపై క్యూలో నిల్చున్నారు.

    చాణక్యపురిలోని వివేకానంద కాలనీలో ట్యాంకర్లు ఎక్కి నీటిని నింపుకునే పరిస్థితి నెలకొంది.

    పెరుగుతున్న సంక్షోభం మధ్య, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిజెపి నాయకులు తమ రాజకీయ విభేదాలను పక్కనబెట్టి, దేశ రాజధానిలో నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కలిసి పనిచేయాలని కోరారు. 'మండే వేడిలో, నీటి డిమాండ్ చాలా పెరిగింది. ఇక ఢిల్లీకి పక్క రాష్ట్రాల నుంచి వచ్చే నీరు కూడా తగ్గిపోయింది. అంటే డిమాండ్ బాగా పెరిగి సరఫరా తగ్గింది. మనమందరం కలిసి దీనిని పరిష్కరించుకోవాలి' అని కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అరవింద్ కేజ్రీవాల్ చేసిన పోస్ట్ 

    इस बार पूरे देश में अभूतपूर्व गर्मी पड़ रही है जिसकी वजह से देश भर में पानी और बिजली का संकट हो गया है। पिछले वर्ष, दिल्ली में बिजली की पीक डिमांड 7438 MW थी। इसके मुक़ाबले इस साल पीक डिमांड 8302 MW तक पहुँच गयी है। पर इसके बावजूद दिल्ली में बिजली की स्थिति नियंत्रण में है, अन्य…

    — Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2024

    Details 

    ఢిల్లీ వాటా నీటిని హర్యానా అందించడం లేదు : అతిషి

    అంతకుముందు, మే 1 నుండి ఢిల్లీ వాటా నీటిని హర్యానా అందించడం లేదని జలవనరుల మంత్రి అతిషి ఆరోపించారు.

    రానున్న రోజుల్లో నగరానికి యమునా నీటి సరఫరా మెరుగుపడకపోతే, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని ఆమె అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్
    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం
    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్
    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం

    దిల్లీ

    Delhi: ఢిల్లీలో టారో కార్డ్ రీడర్‌పై అత్యాచారం.. పరారీలోనిందితుడు  అత్యాచారం
    Building Collapsed: ఢిల్లీలో రెండంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి భారతదేశం
    Delhi : ఢిల్లీలో బాలికపై కత్తితో దాడి.. సీసీటీవీ ఫుటేజీ వైరల్‌ భారతదేశం
    Assam: ఐఎస్ఐఎస్‌లో సంస్థలో చేరతానని ఈమెయిల్‌.. ఐఐటీ గౌహతి విద్యార్థి అరెస్ట్ అస్సాం/అసోం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025