NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ

    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ

    వ్రాసిన వారు Stalin
    Feb 18, 2023
    02:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ మద్యం కేసులో డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాకు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆదివారం తమ ప్రధాన కార్యాలయానికి రావాలని సీబీఐ సమన్లు జారీ చేసినట్లు సిసోడియా శనివారం ట్వీట్ చేశారు.

    మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా లభించిన తాజా సాక్ష్యాధారాల ఆధారంగా ఆదివారం సిసోడియాను సీబీఐ విచారించనుంది.

    ఈడీ, సీబీఐ తమ పూర్తి అధికారాలను తనపై ప్రయోగిస్తున్నాయని, అధికారులు తన ఇంటిపై దాడులు చేసినట్లు పేర్కొన్నారు. తన బ్యాంకు లాకర్‌లో అధికారులు సోదాలు చేశారు కానీ తనకు వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదని చెప్పారు. విచారణకు తాను ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటానని సిసోడియా ట్వీట్‌లో పేర్కొన్నారు.

    దిల్లీ

    గతేడాది అక్టోబర్‌లో మనీష్ సిసోడియాను పిలిచిన సీబీఐ

    సిసోడియా సారథ్యంలో దిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవినీతి జరిగినట్లు ఈడీ, సీబీఐ అభియోగాలు మోపాయి. ఈ నేపథ్యంలో మద్యం కేసుకు సంబంధించి సిసోడియాతో పాటు మరో 14మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

    గతేడాది నవంబర్‌లో తీసుకొచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫారసు చేశారు.

    విచారణకు సిఫార్సు చేసిన అనంతరం దిల్లీ ప్రభుత్వం తన కొత్తం మద్యం పాలసీని ఉపసంహరించుకున్నది. ప్రైవేట్ కంపెనీలను తిరిగి మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

    గత ఏడాది అక్టోబర్‌లో మనీష్ సిసోడియాను సీబీఐ విచారణకు పిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    సీబీఐ

    తాజా

    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్

    దిల్లీ

    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు బిహార్
    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు అరవింద్ కేజ్రీవాల్
    ప్యారిస్-ఢిల్లీ: ప్రయాణికుల వికృత చేష్టలను దాచిపెట్టిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ సీరియస్ ఎయిర్ ఇండియా
    విమానంలో మూత్ర విసర్జన: నిందితుడికి బెయిల్ నిరాకరించిన దిల్లీ కోర్టు ఎయిర్ ఇండియా

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు దిల్లీ
    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్ దిల్లీ

    సీబీఐ

    'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు భారతదేశం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025