NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AAP:కేజ్రీవాల్‌ 'ఆపరేషన్ లోటస్' ఆరోపణలపై దర్యాప్తునకు ఎల్ జీ ఆదేశం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AAP:కేజ్రీవాల్‌ 'ఆపరేషన్ లోటస్' ఆరోపణలపై దర్యాప్తునకు ఎల్ జీ ఆదేశం
    కేజ్రీవాల్‌ 'ఆపరేషన్ లోటస్' ఆరోపణలపై దర్యాప్తునకు ఎల్ జీ ఆదేశం

    AAP:కేజ్రీవాల్‌ 'ఆపరేషన్ లోటస్' ఆరోపణలపై దర్యాప్తునకు ఎల్ జీ ఆదేశం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 07, 2025
    02:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు దేశ రాజధాని దిల్లీలో రాజకీయ వేడి మరింత పెరిగింది.

    బీజేపీ 'ఆపరేషన్‌ లోటస్‌'కు కుట్రలు పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు.

    దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించగా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు.

    వివరాలు 

    బీజేపీపై ఆప్‌ ఆరోపణలు 

    బీజేపీ తమ అభ్యర్థులను తమ వైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు.

    కొన్ని ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్‌ కాల్స్‌ చేసి ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఆఫర్‌ చేసినట్టు తెలిపారు.

    అంతేకాకుండా, తప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు నిర్వహించి ఆప్‌ నేతలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

    అయితే, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ పార్టీ నేతలు మోసపోరని స్పష్టం చేశారు.

    బీజేపీ ఓటమి భయంతోనే తమ పార్టీ అభ్యర్థులను ఆకర్షించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోందని ఆప్‌ సీనియర్‌ నేత సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు.

    వివరాలు 

    బీజేపీ స్పందన 

    ఆప్‌ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని బీజేపీ కొట్టిపారేసింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే భయంతోనే ఆప్‌ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని దిల్లీ బీజేపీ చీఫ్‌ విరేంద్ర సచ్‌దేవా పేర్కొన్నారు.

    బీజేపీ కార్యదర్శి విష్ణు మిట్టల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు లేఖ రాయగా, ఆప్‌ నేతల ఆరోపణలను ఏసీబీ ద్వారా విచారించాలని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

    దాంతో, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ విచారణకు ఆదేశాలు జారీ చేయగా, ఏసీబీ అధికారులు కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌ నివాసాలకు చేరుకున్నారు.

    వివరాలు 

    కేజ్రీవాల్‌ నివాసానికి ఆప్‌ అభ్యర్థులు 

    ఈ పరిణామాల మధ్య ఆప్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు.

    70 మంది అభ్యర్థులు, ముఖ్యమంత్రి ఆతిశీ, సీనియర్‌ నేతలు మనీష్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు.

    ఫిబ్రవరి 5న దిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 57.70% ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

    బీజేపీ-ఆప్‌ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనగా, ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీ విజయానికే సూచిస్తున్నాయి. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    Gurpatwant Singh Pannun: ఆమ్ ఆద్మీ పార్టీ పై ఖ‌లిస్తానీ నేత తీవ్ర ఆరోప‌ణ‌లు  గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌
    AAP: 'రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి' సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించిన ఆప్ భారతదేశం
    AAP: ప్రధాని నివాసం ముందు ఆప్ నిరసన.. అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసులు  భారతదేశం
    Atishi Marlena: నాతో సహా నలుగురిని అరెస్టు చేయాలని బీజేపీ చూస్తోంది: అతీషి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025