ప్రధాని మోదీ ఇంటిపై డ్రోన్; ఉలిక్కిపడ్డ దిల్లీ పోలీసులు
దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై సోమవారం ఉదయం డ్రోన్ కనిపించినట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తెల్లవారుజామున 5 గంటలకు, ప్రధానమంత్రి సెక్యూరిటీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు నివాసంపై డ్రోన్ ఎగిరిన విషయాన్ని దిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు డ్రోన్ను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. ప్రధాని నివాసానికి సమీపంలో గుర్తుతెలియని ఎగిరే వస్తువు గురించి సమాచారం అందిందని దిల్లీ పోలీసులు వెల్లడించారు. సమీప ప్రాంతాల్లో క్షుణ్ణంగా సోదాలు చేశామని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ని కూడా సంప్రదించామని ఎలాంటి ఎగిరే వస్తువును గుర్తించలేదని చెప్పారు.