Page Loader
Delhi Air Pollution: నేడు ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ.. GRAP4 సడలింపుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్..
నేడు ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ.. GRAP4 సడలింపుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్..

Delhi Air Pollution: నేడు ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ.. GRAP4 సడలింపుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2024
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) 4 చర్యలను కొనసాగించాలా లేదా అన్న అంశంపై ఈరోజు (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీపావళి పండుగ తర్వాత నగరంలోని గాలి నాణ్యత మరింతగా పడిపోయింది. ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో గాలి నాణ్యత సూచిక (AQI) స్థాయిలు 200 నుంచి 300 మధ్య నమోదు అయ్యాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత ఇంకా ఇప్పటికి మందగించి ఉన్నట్లే చెబుతున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలలో భాగంగా ఢిల్లీ-NCRలో GRAP 4 ను అమలు చేస్తున్నారు.

వివరాలు 

ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టులు నిలిపివేత 

ఈ ప్రణాళిక అమలులో ఉన్నప్పుడు ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, బీఎస్-VI డీజిల్, లేదా ఎలక్ట్రిక్ వాహనాలు తప్ప ఇతర ట్రక్కుల ప్రవేశం నిషేధించబడుతుంది. అంతేకాకుండా, ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టులు పూర్తిగా నిలిపివేయబడ్డాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం, గత 24 గంటల్లో AQI 318గా నమోదైంది. ఇదిలా ఉండగా, యమునా నదిపై విషపూరిత నురుగు వెలుగులోకి వచ్చింది. ఇది నీటిలో అధిక కాలుష్య స్థాయిలను సూచిస్తోంది. భారత వాతావరణ శాఖ ప్రకారం, ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ దశలో కాలుష్య నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.