NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: దిల్లీలో దారుణం.. కిరాణా షాపులో వస్తువులు తీసుకోవడం ఆపేశాడని ..
    తదుపరి వార్తా కథనం
    Delhi: దిల్లీలో దారుణం.. కిరాణా షాపులో వస్తువులు తీసుకోవడం ఆపేశాడని ..
    Delhi: దిల్లీలో దారుణం.. కిరాణా షాపులో వస్తువులు తీసుకోవడం ఆపేశాడని ..

    Delhi: దిల్లీలో దారుణం.. కిరాణా షాపులో వస్తువులు తీసుకోవడం ఆపేశాడని ..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 02, 2024
    11:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని వాయువ్య ప్రాంతంలో ఉన్న షకుర్‌పూర్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కిరాణా షాపులో సరుకులు కొనడం లేదన్న కోపంతో దుకాణదారుడు ఓ వినియోగదారుడి ప్రాణాలను బలి తీసుకున్నాడు.

    వార్తా సంస్థ PTI ప్రకారం, ఈ సంఘటన జూన్ 30 న జరిగినట్లు చెబుతున్నారు. మృతి చెందిన కస్టమర్‌ని విక్రమ్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు.

    నిందితుడు దుకాణదారు లోకేష్‌ గుప్తా, ఇద్దరు కుమారులు ప్రియాంష్‌, హర్ష్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

    వివరాలు 

    అసలు విషయం ఏమిటి? 

    గుప్తా తన కొడుకులతో కలిసి కిరాణా దుకాణం నడుపుతున్నాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బాధితుడు విక్రమ్ కుటుంబం గుప్తాకు పాత కస్టమర్.

    సుమారు నెల రోజుల క్రితం, కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు, సమస్యల కారణంగా గుప్తా దుకాణంలో ఆహార పదార్థాలు కొనడం మానేశారు.

    ఇది గుప్తా, అతని కొడుకులకు కోపం తెప్పించింది. జూన్ 30వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటలకు వీరి మధ్య గొడవ జరిగింది.

    విచారణ 

    చిన్న విషయమే హత్యకు దారి తీసింది 

    గుప్తా, విక్రమ్‌లు షాపింగ్ విషయంలో గొడవ పడ్డారని, అది కాస్తా పెరిగి ఘర్షణకు దారితీసిందని పోలీసులు తెలిపారు.

    ఈ గొడవలో గుప్తా, అతని కుమారులు విక్రమ్‌ తలపై ఇనుప రాడ్‌తో కొట్టి మెడపై దాడి చేశారని తెలిపారు.

    విక్రమ్ అక్కడికక్కడే మృతి చెందగా, నిందితులందరూ పరారీలో ఉన్నారు. తర్వాత పోలీసులు వారిని పట్టుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    దిల్లీ

    Delhi : ఢిల్లీ మహిళా కమిషన్ నుండి 223 మంది ఉద్యోగుల తొలగింపు.. LG ఆదేశాలు  భారతదేశం
    Arvind Kejriwal: కేజ్రీవాల్'ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలని పిటిషన్.. న్యాయవాది పిటిషనర్‌కు లక్ష రూపాయల జరిమానా  అరవింద్ కేజ్రీవాల్
    Delhi Doctor Murder: ఢిల్లీలో డాక్టర్​ దారుణ హత్య ...ఇంటిలో బీభత్సం సృష్టించిన దొంగలు భారతదేశం
    Swati Maliwal: ఢిల్లీ సీఎం హౌస్‌లో స్వాతి మలివాల్ పై దాడి ? .. దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025