NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi : దిల్లీలో పెను విషాదం.. యమునా నదిలో మునిగి నలుగురు విద్యార్థులు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Delhi : దిల్లీలో పెను విషాదం.. యమునా నదిలో మునిగి నలుగురు విద్యార్థులు మృతి 
    దిల్లీలో పెను విషాదం.. యమునా నదిలో మునిగి నలుగురు విద్యార్థులు మృతి

    Delhi : దిల్లీలో పెను విషాదం.. యమునా నదిలో మునిగి నలుగురు విద్యార్థులు మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 21, 2024
    01:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    10వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మంగళవారం దిల్లీలోని బురారీ ప్రాంతంలో యమునా నదిలో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు.

    దిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,ఉత్తర్‌ప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని లోనీలోని రామ్‌పార్క్‌లో నివసించే నలుగురు స్నేహితులు ఆదిత్య రావత్, శివం యాదవ్, రామన్, ఉదయ్ ఆర్య మంగళవారం స్నానం చేయడానికి యమునా ఘాట్‌కు చేరుకున్నారు.

    వీరందరి వయస్సు 16-17 ఏళ్ళ మధ్య ఉంటుంది.ఈ నలుగురు పిల్లలు 10వ తరగతి చదువుతున్నారు. వీరందరూ స్నానం చేస్తుండగా యమునా నదిలో మునిగి చనిపోయారు.

    Details 

    రెస్క్యూ ఆపరేషన్ లో మూడు మృతదేహాలు గుర్తింపు  

    సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నలుగురు నీటిలో మునిగిపోవడంతో అగ్నిమాపక శాఖ, బోట్‌క్లబ్‌కు సమాచారం అందించారు.

    తదనంతరం, రెస్క్యూ బోట్ టీమ్, మూడు ఫైర్ టెండర్లు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

    రెస్క్యూ బోట్ బృందం మూడు మృతదేహాలను గుర్తించింది, అయితే ఒకరి ఆచూకీ తెలియాల్సి ఉంది.అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది.

    ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచారు. ఈ కేసుకు సంబంధించి పోలీసు విచారణ ప్రారంభమైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    దిల్లీ

    IndiGo Airlines: ఇండిగో విమానంలో షాకింగ్ ఘటన.. పైలట్ పై దాడి చేసిన ప్రయాణికుడు  భారతదేశం
    Delhi: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100 విమానాలు, 18 రైళ్లు ఆలస్యం  తాజా వార్తలు
    IndiGo Airlines: ఢిల్లీ-గోవా ఇండిగో పైలట్‌కు కొట్టిన ప్రయాణికుడి క్షమాపణ వీడియో వైరల్‌  భారతదేశం
    Delhi: ఢిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు .. 50 విమానాలు, 30 రైళ్లుపై స‌ర్వీసుల‌కు తీవ్ర అంత‌రాయం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025