NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cyclone Michaung: ఆంధ్రప్రదేశ్‌లో 40లక్షల మందిపై 'మిచౌంగ్' తుపాను ప్రభావం 
    తదుపరి వార్తా కథనం
    Cyclone Michaung: ఆంధ్రప్రదేశ్‌లో 40లక్షల మందిపై 'మిచౌంగ్' తుపాను ప్రభావం 
    Cyclone Michaung: ఆంధ్రప్రదేశ్‌లో 40లక్షల మందిపై 'మిచౌంగ్' తుపాను ప్రభావం

    Cyclone Michaung: ఆంధ్రప్రదేశ్‌లో 40లక్షల మందిపై 'మిచౌంగ్' తుపాను ప్రభావం 

    వ్రాసిన వారు Stalin
    Dec 06, 2023
    09:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బంగాళాఖాతంలో ఏర్పడిన 'మిచౌంగ్' తుపాను ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ప్రభావాన్ని చూపింది.

    తుపాను మంగళవారం తీరం దాటే సమయంలో అల్లకల్లోలం సృష్టించింది.

    ఈదురుగాలులు, భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 770 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 35 చెట్లు నేలకూలాయి. అనేక పశువులు మరణించాయి.

    రాష్ట్రంలో 194 గ్రామాలు, రెండు పట్టణాలకు చెందిన దాదాపు 40 లక్షల మంది ప్రజలు 'మిచౌంగ్' తుపాను కారణంగా అవస్థలు పడినట్లు ఏపీ సీఎంఓ వెల్లడించింది. దాదాపు 25గ్రామాలు ముంపునకు గురయ్యాయి.

    'మిచౌంగ్' తుపాను వల్ల కురిసిన వర్షాల కారణంగా తమిళనాడు, ఏపీలో కలిపి 12మంది ప్రాణాలు కోల్పోయారు.

    తిరుపతిలో గోడ కూలి నాలుగేళ్ల బాలుడు, బాపట్లలో మరొకరు మృతి చెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.

    తుపాను

    తీవ్ర అల్పపీడనంగా మారిన తుపాను

    తుపాను బుధవారం నాటికి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని ఐఎండీ తెలిపింది.

    ఇది బాపట్లకు ఉత్తర వాయువ్యంగా 100 కి.మీ, ఖమ్మంకు ఆగ్నేయంగా 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.

    రానున్న 6 గంటల్లో తుపాను మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని, తదుపరి 6 గంటల్లో అల్పపీడనం బాగా తగ్గుతుందని ఐఎండీ అంచనా వేసింది.

    ఆంధ్రప్రదేశ్‌లో తుపాను తీరం దాటిన తర్వాత మంగళవారం రాత్రి ఒడిశాలోని దక్షిణాది జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసిశాయి.

    దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో మంగళవారం తిరుపతిలో ఏడు, నెల్లూరులో మూడు చోట్ల 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

    నెల్లూరు జిల్లా మనుబోలులో అత్యధికంగా 366.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

    తుపాను

    78 గుడిసెలు, 232 ఇళ్లు నేలమట్టం

    తుపాను బాధిత జిల్లాలకు ఏపీ ప్రభుత్వం సహాయక చర్యల కోసం రూ.23 కోట్లు మంజూరు చేసింది.

    78 గుడిసెలు, పశువుల కొట్టం ఉండగా, 232 ఇళ్లు తుపాను వల్ల నేలమట్టమయ్యాయి. రెండు కచ్చా ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

    విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో బుధవారం 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

    చెన్నై, దాని పొరుగు జిల్లాలలో సంభవించిన భారీ నష్టాల కారణంగా రూ. 5,060 కోట్ల మధ్యంతర ఆర్థిక సహాయం కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తుపాను
    ఆంధ్రప్రదేశ్
    బంగాళాఖాతం

    తాజా

    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్
    Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు! బాయ్‌కాట్‌ టర్కీ
    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం మధ్యప్రదేశ్

    తుపాను

    సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు! నాసా
    రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను  తాజా వార్తలు
    ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు తెలంగాణ
    మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు ఐఎండీ

    ఆంధ్రప్రదేశ్

    Ap Skill Development : స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. ఆ 12మంది ఐఏఎస్ అధికారులపై సీఐడీకి ఫిర్యాదు చంద్రబాబు నాయుడు
    Supreme Court : రిషికొండలో నిర్మాణాలపై సుప్రీం సంచలన తీర్పు.. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని నిలదీత  సుప్రీంకోర్టు
    Journalist houses In Ap : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. కొనసాగుతున్న భేటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    Purendeswari: విజయసాయి రెడ్డి భూ దోపిడీకి పాల్పడుతున్నారు.. బెయిల్ రద్దు చేయండి: సీజేఐకి పురందేశ్వరి లేఖ దగ్గుబాటి పురందేశ్వరి

    బంగాళాఖాతం

    రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు: 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్  ఐఎండీ
    బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    బంగాళాఖాతంలో వాయుగుండం.. ఒడిశా వ్యాప్తంగా దంచికొట్టనున్న వర్షాలు భారీ వర్షాలు
    AP Rains : బంగాళాఖాతంలో తుఫాన్.. ఇక ఏపీలో వానలే వానలు! ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025