NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharastra: గవర్నర్‌తో షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వినతి
    తదుపరి వార్తా కథనం
    Maharastra: గవర్నర్‌తో షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వినతి
    గవర్నర్‌తో షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వినతి

    Maharastra: గవర్నర్‌తో షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వినతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 04, 2024
    04:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ముచ్చటగా మూడోసారి ఎన్నికయ్యారు.

    ఆయన గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఫడ్నవిస్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కాగా, మహాయుతి కూటమి నేతలు ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిశారు.

    ఫడ్నవిస్‌తో పాటు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఎల్పీ నేతగా ఫడ్నవిస్ ఎన్నికైన పత్రాలను గవర్నర్‌కు అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

    వివరాలు 

    7:7:7 నిష్పత్తిలో మంత్రి పదవులు

    ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం సాయంత్రం 5.30 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరగనుంది.

    ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్, డిప్యూటీ ముఖ్యమంత్రులుగా షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేయనున్నారు.

    ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు.

    కొత్త ప్రభుత్వంలో షిండే కీలక పాత్ర పోషిస్తారని ఫడ్నవిస్ తెలిపారు.

    ఈసారి ప్రభుత్వం మూడు పార్టీల మధ్య 7:7:7 నిష్పత్తిలో మంత్రి పదవులను పంచుకోనుంది.

    బీజేపీ, శివసేన, ఎన్సీపీ నుంచి ఏడుగురు చొప్పున మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.

    బుధవారం మంత్రి పదవులపై చర్చించేందుకు ఫడ్నవిస్‌తో ఏక్‌నాథ్ షిండే సమావేశమయ్యారు. శివసేనకు సంబంధించిన శాఖల కేటాయింపుపై షిండే చర్చించారు.

    వివరాలు 

    మహా వికాస్ అఘాడి కూటమికి పెద్ద ఎదురుదెబ్బ

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం బీజేపీ 132 సీట్లు గెలుచుకోగా, శివసేన 57, ఎన్సీపీ 41, కాంగ్రెస్ 16, ఉద్ధవ్ థాక్రే 20, శరద్ పవార్ 10 సీట్లు సాధించారు.

    ఈ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ కారణమని ఆరోపించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గవర్నర్ ని కలిసిన  మహాయుతి కూటమి నేతలు

    Mumbai: Shiv Sena chief Eknath Shinde, BJP leader Devendra Fadnavis, NCP chief Ajit Pawar stake claim to form the government in the state.

    Devendra Fadnavis to take oath as CM of Maharashtra tomorrow, 5th December pic.twitter.com/tZoAaSzkhn

    — ANI (@ANI) December 4, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    మహారాష్ట్ర

    Hottest October: 120 ఏళ్లు తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు.. అత్యధిక వేడిగా అక్టోబర్ మధ్యప్రదేశ్
     Maharashtra: ఎన్నికల్లో భాగంగా మ్యానిఫెస్టోను రిలీజ్ చేసిన ఎన్సీపీ  ఇండియా
    BJP: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్.. రైతులకు రుణమాఫీ, వృద్ధులకు పెన్షన్ పెంపు బీజేపీ
    Siddiqui's case: 'కుదిరితే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జీషన్ సిద్ధిఖీ'.. నిందితుడి కీలక వ్యాఖ్యలు బాబా సిద్ధిఖీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025