DGP Anjani kumar: తెలంగాణ డీజీపీని సస్పెండ్ చేసిన ఎన్నికల సంఘం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కీలక పరిణాణం చోటు చేసుకుంది. ఎన్నికల నియామవళిని ఉంల్లఘించిన నేపథ్యంలో డీజీపీ అంజనీ కుమార్ను సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల నియామవళిని ఉంల్లఘించి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిని డీజీపీతో పాటు రాష్ట్ర పోలీసు నోడల్ అధికారులు సంజయ్ జైన్, మహేష్ భగవత్లపై కూడా ఎన్నికల సంఘం వేటు వేసింది. ఈమేరకు సంజయ్ జైన్, మహేష్ భగవత్లకు ఈసీ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే రేవంత్ రెడ్డిని ఈ అధికారులు కలసి.. సెల్యూట్ చేసి, బోకేను అందజేయడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. అంజనీ కుమార్ స్థానంలో అర్హులైన్ అధికారిని డీజీపీగా నియమించాలని ఈసీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.