NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / BRICS: "మా మద్దతు ఎప్పుడూ దౌత్యానికే".. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    BRICS: "మా మద్దతు ఎప్పుడూ దౌత్యానికే".. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ
    "మా మద్దతు ఎప్పుడూ దౌత్యానికే".. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ

    BRICS: "మా మద్దతు ఎప్పుడూ దౌత్యానికే".. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 23, 2024
    04:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

    భారతదేశం అంతర్జాతీయ దౌత్యం, చర్చలకు మద్దతు ఇస్తుందని, యుద్ధానికి వ్యతిరేకంగా కాదని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఆర్థిక అస్థిరతలు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.

    ప్రపంచాన్ని సరైన దిశలో నడిపించడంలో బ్రిక్స్ సానుకూల పాత్ర పోషించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    వివరాలు 

    బ్రిక్స్ భాగస్వాములుగా ఇతర దేశాలను ఆహ్వానించడానికి సిద్ధం: మోదీ 

    "కొవిడ్ వంటి సవాళ్లను ఎదుర్కొన్నట్లుగా, మనం భవిష్యత్తు తరాలకు కొత్త అవకాశాలు సృష్టించగలం. ఉగ్రవాదం, ఉగ్ర సంస్థలకు వనరులను సమకూర్చడం కట్టడి చేయాలంటే ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదు. ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంగా మాత్రమే చూడాలి. మన దేశాల్లో యువతను అతివాద భావజాలం వైపు మరల్చే చర్యలను అడ్డుకునేందుకు చురుగ్గా వ్యవహరించాలి. సైబర్ సెక్యూరిటీ, సురక్షిత కృత్రిమ మేధకానికి అంతర్జాతీయ నియంత్రణలను తీసుకువచ్చేందుకు మనందరం కృషి చేయాలి" అని ఆయన సూచించారు.

    భారత్ బ్రిక్స్ భాగస్వాములుగా ఇతర దేశాలను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు.

    ఈ విషయంలో వ్యవస్థాపక సభ్య దేశాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.

    ఐరాస భద్రతా మండలిలో,ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల అవసరాన్ని మరోసారి గుర్తు చేశారు.

    వివరాలు 

    కూటమి విస్తరణ తర్వాత ఇదే తొలి శిఖరాగ్ర సదస్సు

    గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.

    భిన్నమైన ఆలోచనల, భావజాలాల సమ్మేళనంగా ఏర్పడిన బ్రిక్స్, ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.

    ఇది 'బ్రిక్స్' కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు. ఈ సందర్భంగా సభ్య దేశాల నాయకులు దిగిన గ్రూప్ ఫొటోను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

    బ్రెజిల్, రష్యా, భారత్, చైనా,యు దక్షిణ ఆఫ్రికాతో కలిసి బ్రిక్స్ కూటమి ఏర్పడింది.

    ఇప్పుడు ఈ కూటమిని విస్తరించి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలకు సభ్యత్వం ఇవ్వడం జరిగింది. కూటమి విస్తరణ తర్వాత ఇదే తొలి శిఖరాగ్ర సదస్సు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    నరేంద్ర మోదీ

    USA: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక చర్చలకు ఊతం జో బైడెన్
    Narendra Modi: 'క్యాన్సర్‌ మూన్‌షాట్‌'లో మోదీ కీలక ప్రకటన.. 40 మిలియన్ల వ్యాక్సిన్‌ డోస్‌ల సాయం క్యాన్సర్
    Arvind Kejriwal: నరేంద్ర మోదీ నాపై కుట్ర చేసి నా ప్రతిష్టను దెబ్బతీయాలనుకున్నాడు : కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్
    PM Modi: ఏఐ అంటే అమెరికన్ ఇండియన్స్ .. ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025