NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు? 
    తదుపరి వార్తా కథనం
    అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు? 
    అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు?

    అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు? 

    వ్రాసిన వారు Stalin
    Apr 23, 2023
    10:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పంజాబ్ పోలీసులను ఇన్ని రోజులు ముప్పుతిప్పలు పెట్టిన అమృత్‌పాల్ సింగ్ ఆదివారం అరెస్టు అయ్యారు.

    అయితే ఆయన నిజంగానే అరెస్టు అయ్యారా? లేక అమృత్‌పాల్ సింగ్ కావాలనే పోలీసులకు లొంగిపోయాడా? ప్రత్యక్ష సాక్షి రోదేవాల్ గురుద్వారా మతాధికారి సింగ్ సాహిబ్ గియానీ జస్బీర్ సింగ్ ఏం చెప్పారు?

    చాలా రోజులుగా పరారీలో ఉన్న అమృత్‌పాల్ సింగ్ అనూహ్యంగా పోలీసులకు చిక్కడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    అమృత్‌పాల్ సింగ్‌ను పక్కా వ్యూహంతో పోలీసులు అరెస్టు చేయలేదని తెలుస్తోంది. తనకు తాను గానే అమృత్‌పాల్ అరెస్టు అయినట్లు రోదేవాల్ గురుద్వారా మతాధికారి సింగ్ సాహిబ్ గియానీ జస్బీర్ సింగ్ చెప్పారు.

    పంజాబ్

    గురుద్వారాలో భక్తులను ఉద్దేశించి అమృత్‌పాల్ ప్రసంగం 

    అమృత్‌పాల్ సింగ్ శనివారం రాత్రి రోదేవాల్ గురుద్వారాకు వచ్చినట్లు మతాధికారి సింగ్ సాహిబ్ గియానీ జస్బీర్ సింగ్ చెప్పారు.

    అమృత్‌పాల్ అక్కడ ఉన్నట్లు తన ఉనికిని తానే పోలీసులకు తెలియజేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం7 గంటలకు లొంగిపోయినట్లు చెప్పారు.

    అరెస్టుకు కొన్ని గంటలు అమృత్‌పాల్ సింగ్ మోగాలోని రోదేవాల్ గురుద్వారాలో భక్తులను ఉద్దేశించి ప్రసంగించడం గమనార్హం.

    అమృత్‌పాల్ సింగ్ ఇచ్చిన సంకేతాల మేరకే పోలీసులు మోగాలో అతన్ని చుట్టిముట్టారు. అనతంరం అతన్ని అరెస్టు చేశారు.

    పంబాబ్ 

    ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే అమృతపాల్‌ను చుట్టుముట్టాం: పంజాబ్ ఐజీపీ 

    అమృతపాల్ సింగ్‌ అరెస్టుపై పంజాబ్ ఐజీపీ సుఖ్‌చైన్ సింగ్ గిల్ స్పందించారు. అమృతపాల్ సింగ్‌ను ఆదివారం ఉదయం 6.45 గంటలకు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

    తాము అతన్ని అరెస్టు చేసేందుకు నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీని మోహరించినట్లు వివరించారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా మోగాలోని రోడ్ గ్రామంలో అతన్ని అరెస్టు చేసినట్లు ఐజీపీ పేర్కొన్నారు.

    పోలీసులు చుట్టుముట్టిన తర్వాత అతను పారిపోవడానికి ఎలాంటి దారులు లేవని, ఈ క్రమంలో అతను లొంగిపోక తప్పలేదని పంజాబ్ ఐజీపీ సుఖ్‌చైన్ సింగ్ గిల్ వెల్లడించారు.

    అమృత్‌పాల్ అరెస్టు నేపథ్యంలో పోలీసులు పంజాబ్‌లో హై అలర్ట్ ప్రకటించారు. శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు ఎటువంటి నకిలీ వార్తలను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయొద్దని పంజాబ్ పోలీసులు కోరారు.

    పంజాబ్ 

    దేశంలోనే అత్యంత సురక్షితమైనది దిబ్రూఘర్ జైలు

    అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన తర్వాత పంజాబ్ పోలీసులు అతన్ని భటిండాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం అక్కడి నుంచి అసోంలోని దిబ్రూఘర్‌ జైలుకు తరలించారు.

    అమృతపాల్ ప్రధాన అనుచరులు పాపల్‌ప్రీత్ సింగ్, దల్జీత్ సింగ్ కల్సి, భగవంత్ సింగ్ అలియాస్ బజేకే, గుర్మీత్ సింగ్ బుక్కన్వాల్, బసంత్ సింగ్ దౌలత్‌పురా, హర్జిత్ సింగ్, వరీందర్ సింగ్ అలియాస్ ఫౌజీ, వరీందర్ సింగ్, గురిందర్ పాల్ సింగ్ అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు.

    1859-60లో నిర్మించిన దిబ్రూఘర్ జైలును దేశంలోనే అత్యంత సురక్షితమైన జైలుగా అధికారులు భావిస్తున్నారు.

    ఇది ఈశాన్య ప్రాంతంలోని పురాతన జైలు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్
    ఖలిస్థానీ
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Pakistan: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు కుట్ర.. తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్‌  బీఎస్‌ఎఫ్‌
    IPL 2025: నిబంధనను అతిక్రమించిన ముంబయి ఇండియన్స్‌.. పెనాల్టీగా నోబాల్‌! ముంబయి ఇండియన్స్
    Delhi Police: భారత్'లో మరో ఉగ్ర దాడికి ఐఎస్‌ఐ కుట్ర ..స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు  ఐఎస్‌ఐ
    Trump - Ramaphosa Meeting: సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై దాడి ఆరోపణలు.. తిప్పికొట్టిన సిరిల్ రామఫోసా డొనాల్డ్ ట్రంప్

    పంజాబ్

    ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్ ఆస్ట్రేలియా
    దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఎన్ఐఏ
    అమృతపాల్ సింగ్‌ అరెస్టుకు ఆపరేషన్ షురూ: ఇంటర్నెట్ బంద్; పంజాబ్‌లో ఉద్రిక్తత ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    ఖలిస్థానీ

    లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం బ్రిటన్
    'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు పంజాబ్
    అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు పంజాబ్
    అమృత్‌పాల్ సింగ్ వేషం మార్చుకున్నాడా? 7ఫొటోలను విడుదల చేసిన పంజాబ్ పోలీసులు పంజాబ్

    తాజా వార్తలు

    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్
     వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్‌తో చేతులు కలిపిన లక్ష్మీనారాయణ  వైజాగ్
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే  కర్ణాటక
    'స్వలింగ వివాహం అర్బన్ కాన్సెప్ట్ కాదు'; కేంద్రం వాదనలను వ్యతిరేకించిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 8,000 మందికి వైరస్ కోవిడ్
    Audi Q3: ఆడి కార్ల ధరలు పెంపు; సవరించిన రేట్లు మే 1నుంచి అమలు  కార్
    తమిళనాడు కంబం ద్రాక్షకు జీఐ ట్యాగ్  తమిళనాడు
    భటిండా మిలిటరీ క్యాంపు; జవాన్లపై కాల్పులు జరిపింది ఎవరు? రైఫిల్ ఎక్కడ?  పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025