NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు? 
    అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు? 
    భారతదేశం

    అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు? 

    వ్రాసిన వారు Naveen Stalin
    April 23, 2023 | 10:47 am 1 నిమి చదవండి
    అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు? 
    అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు?

    పంజాబ్ పోలీసులను ఇన్ని రోజులు ముప్పుతిప్పలు పెట్టిన అమృత్‌పాల్ సింగ్ ఆదివారం అరెస్టు అయ్యారు. అయితే ఆయన నిజంగానే అరెస్టు అయ్యారా? లేక అమృత్‌పాల్ సింగ్ కావాలనే పోలీసులకు లొంగిపోయాడా? ప్రత్యక్ష సాక్షి రోదేవాల్ గురుద్వారా మతాధికారి సింగ్ సాహిబ్ గియానీ జస్బీర్ సింగ్ ఏం చెప్పారు? చాలా రోజులుగా పరారీలో ఉన్న అమృత్‌పాల్ సింగ్ అనూహ్యంగా పోలీసులకు చిక్కడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమృత్‌పాల్ సింగ్‌ను పక్కా వ్యూహంతో పోలీసులు అరెస్టు చేయలేదని తెలుస్తోంది. తనకు తాను గానే అమృత్‌పాల్ అరెస్టు అయినట్లు రోదేవాల్ గురుద్వారా మతాధికారి సింగ్ సాహిబ్ గియానీ జస్బీర్ సింగ్ చెప్పారు.

    గురుద్వారాలో భక్తులను ఉద్దేశించి అమృత్‌పాల్ ప్రసంగం 

    అమృత్‌పాల్ సింగ్ శనివారం రాత్రి రోదేవాల్ గురుద్వారాకు వచ్చినట్లు మతాధికారి సింగ్ సాహిబ్ గియానీ జస్బీర్ సింగ్ చెప్పారు. అమృత్‌పాల్ అక్కడ ఉన్నట్లు తన ఉనికిని తానే పోలీసులకు తెలియజేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం7 గంటలకు లొంగిపోయినట్లు చెప్పారు. అరెస్టుకు కొన్ని గంటలు అమృత్‌పాల్ సింగ్ మోగాలోని రోదేవాల్ గురుద్వారాలో భక్తులను ఉద్దేశించి ప్రసంగించడం గమనార్హం. అమృత్‌పాల్ సింగ్ ఇచ్చిన సంకేతాల మేరకే పోలీసులు మోగాలో అతన్ని చుట్టిముట్టారు. అనతంరం అతన్ని అరెస్టు చేశారు.

    ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే అమృతపాల్‌ను చుట్టుముట్టాం: పంజాబ్ ఐజీపీ 

    అమృతపాల్ సింగ్‌ అరెస్టుపై పంజాబ్ ఐజీపీ సుఖ్‌చైన్ సింగ్ గిల్ స్పందించారు. అమృతపాల్ సింగ్‌ను ఆదివారం ఉదయం 6.45 గంటలకు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తాము అతన్ని అరెస్టు చేసేందుకు నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీని మోహరించినట్లు వివరించారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా మోగాలోని రోడ్ గ్రామంలో అతన్ని అరెస్టు చేసినట్లు ఐజీపీ పేర్కొన్నారు. పోలీసులు చుట్టుముట్టిన తర్వాత అతను పారిపోవడానికి ఎలాంటి దారులు లేవని, ఈ క్రమంలో అతను లొంగిపోక తప్పలేదని పంజాబ్ ఐజీపీ సుఖ్‌చైన్ సింగ్ గిల్ వెల్లడించారు. అమృత్‌పాల్ అరెస్టు నేపథ్యంలో పోలీసులు పంజాబ్‌లో హై అలర్ట్ ప్రకటించారు. శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు ఎటువంటి నకిలీ వార్తలను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయొద్దని పంజాబ్ పోలీసులు కోరారు.

    దేశంలోనే అత్యంత సురక్షితమైనది దిబ్రూఘర్ జైలు

    అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన తర్వాత పంజాబ్ పోలీసులు అతన్ని భటిండాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం అక్కడి నుంచి అసోంలోని దిబ్రూఘర్‌ జైలుకు తరలించారు. అమృతపాల్ ప్రధాన అనుచరులు పాపల్‌ప్రీత్ సింగ్, దల్జీత్ సింగ్ కల్సి, భగవంత్ సింగ్ అలియాస్ బజేకే, గుర్మీత్ సింగ్ బుక్కన్వాల్, బసంత్ సింగ్ దౌలత్‌పురా, హర్జిత్ సింగ్, వరీందర్ సింగ్ అలియాస్ ఫౌజీ, వరీందర్ సింగ్, గురిందర్ పాల్ సింగ్ అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. 1859-60లో నిర్మించిన దిబ్రూఘర్ జైలును దేశంలోనే అత్యంత సురక్షితమైన జైలుగా అధికారులు భావిస్తున్నారు. ఇది ఈశాన్య ప్రాంతంలోని పురాతన జైలు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    పంజాబ్
    ఖలిస్థానీ
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    పంజాబ్

    ఎట్టకేలకు ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్  ఖలిస్థానీ
    లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు అమృత్‌సర్
    అమృత్‌సర్‌కు అమృత్‌పాల్ సింగ్!; నిఘాను పెంచిన పంజాబ్ పోలీసులు ఖలిస్థానీ
    పంజాబ్‌: భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి ఆర్మీ

    ఖలిస్థానీ

    అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్!  పంజాబ్
    అమృత్‌పాల్ సింగ్ మెంటర్ పాపల్ ప్రీత్ సింగ్ అరెస్ట్  పంజాబ్
    పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా? పంజాబ్
    దిల్లీ రోడ్లపై కనిపించిన అమృత్ పాల్ సింగ్; తలపాగా లేకుండా కళ్లద్దాలు, డెనిమ్ జాకెట్‌తో దర్శనం దిల్లీ

    తాజా వార్తలు

    లక్ష మంది లోపే జనాభా ఉన్న ఈ దేశాల గురించి తెలుసా? వాటికన్ సిటీ
    కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి  కర్ణాటక
    దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా; 42 మరణాలు  కరోనా కొత్త కేసులు
    బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్ ఖారారు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన; 8 రాష్ట్రాలకు లేఖ  కోవిడ్
    ఉగ్రదాడిలో మరణించిన ఐదుగురు జవాన్ల పేర్లు వెల్లడి; రంగంలోకి ఎన్ఐఏ  జమ్ముకశ్మీర్
    మే నెలలో భారత్‌కు రానున్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి; 2014 తర్వాత వస్తున్న తొలి నాయకుడు పాకిస్థాన్
    'స్వలింగ వివాహం అర్బన్ కాన్సెప్ట్ కాదు'; కేంద్రం వాదనలను వ్యతిరేకించిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023