Page Loader
Tamilnadu: డీఎంకే ఎంపీ ఎ. రాజాకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. మైలాదుతురై సభలో ప్రసంగిస్తుండగా ఘటన (వీడియో) 
డీఎంకే ఎంపీ ఎ. రాజాకు త్రుటిలో తప్పిన ప్రమాదం..

Tamilnadu: డీఎంకే ఎంపీ ఎ. రాజాకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. మైలాదుతురై సభలో ప్రసంగిస్తుండగా ఘటన (వీడియో) 

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2025
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో డీఎంకే పార్టీ నిర్వహించిన ఒక సభలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. పార్టీ ఎంపీ,మాజీ కేంద్ర మంత్రి ఎ. రాజా ప్రసంగిస్తున్న సమయంలో వేదికపై అమర్చిన భారీ లైట్ ఒక్కసారిగా కూలిపోయింది. అదృష్టవశాత్తు,ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. మే 4వ తేదీన,మైలాదుతురైలో డీఎంకే పార్టీ ఓ ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు వేడుకలు,గవర్నర్ విషయంలో పార్టీ సాధించిన న్యాయ విజయం సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

వివరాలు 

ప్రమాదానికి బలమైన గాలులు కారణం 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజా, వేదికపై నుంచి ప్రసంగిస్తుండగా,స్టీల్ రాడ్‌కు అమర్చిన బరువైన లైట్ ఒక్కసారిగా ఆయన మైక్రోఫోన్‌పై పడిపోయింది. ప్రాథమికంగా, ఈ ప్రమాదానికి బలమైన గాలులు కారణమని తెలుస్తోంది. దీంతో లైట్ స్టాండ్ కదిలి పడింది. లైట్ నేరుగా మైక్‌పై పడటంతో రాజాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ అనూహ్య పరిణామంతో సభలో ఉన్నవారు, వేదికపై ఉన్న నేతలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బంది పరిస్థితిని పటిష్టంగా చక్కదిద్దారు. రాజా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కార్యక్రమం యథావిధిగా కొనసాగింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాదం జరిగిన వీడియో