NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా?
    భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా?

    Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా?

    వ్రాసిన వారు Stalin
    Apr 19, 2023
    11:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరం నిలిచినట్లు ఓ అధ్యయనం పేర్కొంది.

    గురుగ్రామ్‌లోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో స్ట్రాటజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రాజేష్ కె.పిలానియా నిర్వహించిన అధ్యయనంలో మిజోరం దేశంలోనే సంతోషకరమైన రాష్ట్రంగా తేలింది.

    మిజోరం దేశంలోనే 100 శాతం అక్షరాస్యత సాధించిన రెండో రాష్ట్రం కావడం గమనార్హం. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా విద్యార్థులు చదవుకోవడానికి అవకాశాలను కల్పిస్తోంది.

    కుటుంబ సంబంధాలు, పని సంబంధిత సమస్యలు, సామాజిక సమస్యలు, దాతృత్వం, మతం, ఆనందంపై కరోనా ప్రభావం, సహా ఆరు పారామీటర్ల ఆధారంగా మిజోరం ఆనంద సూచికను రూపొందించినట్లు నివేదిక పేర్కొంది.

    మిజోరం

    ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య మంచి స్నేహ సంబంధం 

    మిజోరం ఐజ్వాల్‌లోని ప్రభుత్వ మిజో హైస్కూల్‌లోని ఓ విద్యార్థి, తన తండ్రి చిన్నతనంలో కుటుంబాన్ని విడిచిపెట్టడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అయినప్పటికీ, చదువులో అతను రాణిస్తున్నాడు. ఆ విద్యార్థి చార్టర్డ్ అకౌంటెంట్ లేదా సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలని ఆశిస్తున్నాడని నివేదిక పేర్కొంది. అక్కడి ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైనట్లు నివేదిక చెప్పింది.

    ఉపాధ్యాయులు తమతో మంచి స్నేహితులుగా ఉంటారని, వారితో ఏదైనా చెప్పడానికి భయపడబోమని ఓ విద్యార్థి చెప్పినట్ల తన నివేదికలో రాజేష్ కె.పిలానియా చెప్పారు.

    మిజోరంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా సమావేశమవుతారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఈ సమావేశం దోహదపడుతుందని నివేదిక పేర్కొంది.

    మిజోరం

    మిజోరంలో చదువు కోసం పిల్లలపై తల్లిదండ్రుల ఒత్తిడి చాలా తక్కువ 

    మిజోరం సామాజిక నిర్మాణం కూడా యువత ఆనందానికి దోహదం చేస్తుందని రాజేష్ కె.పిలానియా పేర్కొన్నారు.

    ఇక్కడి యువత తల్లిదండ్రుల పెంపకం వల్ల చాలా సంతోషంగా ఉన్నట్లు నివేదిక చెప్పింది.

    అలాగే ఇక్కడ చదువుల కోసం తల్లిదండ్రుల ఒత్తిడి చాలా తక్కువ అని ఎబెన్-ఎజర్ బోర్డింగ్ స్కూల్ టీచర్, సిస్టర్ లాల్రిన్మావి ఖియాంగ్టే చెప్పారు.

    మిజో కమ్యూనిటీలోని ప్రతి బిడ్డ, లింగ భేదం లేకుండా సంపాదించడం ప్రారంభిస్తారని నివేదిక పేర్కొంది.

    మిజోరంలో ఏ పనిని కూడా చిన్నగా భావించరు. యువకులు సాధారణంగా 16 లేదా 17 సంవత్సరాల వయస్సులో ఉపాధిని పొందుతారు.

    ఉపాధి విషయంలో బాలికలు, అబ్బాయిల మధ్య ఎటువంటి వివక్ష ఉండదని రాజేష్ కె.పిలానియా నివేదిక పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    భారతదేశం

    ఏప్రిల్ 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన నోకియా C12 ప్లస్ స్మార్ట్ ఫోన్
    దేశంలో కరోనా ఉద్ధృతి; కొత్తగా 3,641మందికి వైరస్; ఏడుగురు మృతి కోవిడ్
    2023 ఆర్ధిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో కార్ల విక్రయాలు ఆటో మొబైల్

    తాజా వార్తలు

    వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్‌దే  ప్రభుత్వం, దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తాం:కేసీఆర్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    కాలువలోకి దూసుకెళ్లిన బస్సు; 12 మంది మృతి  మహారాష్ట్ర
    అలుపెరగని శిల్పకారుడు 'రామ్ వంజీ సుతార్'; 98ఏళ్ల వయసులో అంబేద్కర్ విగ్రహానికి రూపం  అంబేద్కర్
    దేశంలో 10,753 కొత్త కరోనా కేసులు; 27మంది మృతి కరోనా కొత్త కేసులు

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్!  పంజాబ్
    డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన  చైనా
    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా ఐఎండీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025