
Fact Check: ఆర్మీ బ్రిగేడ్పై ఆత్మాహుతి దాడి చేసినట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దు: భారత రక్షణశాఖ
ఈ వార్తాకథనం ఏంటి
భారత సైన్యం జరిపిన దాడులతో పాకిస్థాన్ భయాందోళనకు గురై దుందుడుకు చర్యలకు దిగింది.
ఈ పరిణామాల మధ్య, జమ్ముకశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ దాడులకు పాల్పడిందని భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది.
జమ్మూ, పఠాన్కోట్, ఉద్ధంపుర్ ప్రాంతాల్లో ఉన్న మిలిటరీ స్టేషన్లపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణుల ద్వారా దాడి చేసినట్టు 'ఎక్స్' (మునుపటి ట్విట్టర్) వేదికగా సైన్యం వెల్లడించింది.
అయితే ఈ దాడులను భారత రక్షణ వ్యవస్థ విజయవంతంగా ఎదుర్కొని తిప్పికొట్టిందని స్పష్టం చేసింది.
వివరాలు
బ్రిగేడ్పై ఆత్మాహుతి దాడి.. ఖండించిన భారత సైన్యం
ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణహాని లేదా ఆస్తినష్టం సంభవించలేదని సైన్యం స్పష్టం చేసింది.
దేశ సమగ్రతను కాపాడటంలో, పౌరుల రక్షణలో పూర్తి స్థాయిలో తాము సిద్ధంగా ఉన్నామని భారత సైన్యం ప్రకటించింది.
జమ్మూ కశ్మీర్లోని రాజౌరీ ప్రాంతంలో ఆర్మీ బ్రిగేడ్పై ఆత్మాహుతి దాడి జరిగినట్టు వస్తున్న ప్రచారాన్ని కూడా భారత సైన్యం ఖండించింది.
ఏ సైనిక స్థావరంపైనా అలాంటి దాడి జరగలేదని స్పష్టంగా తెలియజేసింది.
ఈ రకమైన అసత్య సమాచారం ప్రజల్లో గందరగోళం కలిగించే అవకాశముండటంతో, అటువంటి ఫేక్ న్యూస్ను నమ్మొద్దని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆర్మీ బ్రిగేడ్పై ఆత్మాహుతి దాడి చేసినట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దు
🚨 #Fake_news is circulating about a "fidayeen" attack on an Army brigade in #Rajouri, #Jammu and #Kashmir.#PIBFactCheck:
— PIB Fact Check (@PIBFactCheck) May 8, 2025
▶️ No such #fidayeen or suicide attack has occurred on any army cantt.
⚠️ Do not fall for these false claims intended to #mislead and cause confusion. pic.twitter.com/x8Az5tigUO