NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ: సనాతన ధర్మాన్ని అవమానించిన వారి దిష్టిబొమ్మల తొలగింపు
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ: సనాతన ధర్మాన్ని అవమానించిన వారి దిష్టిబొమ్మల తొలగింపు
    దిల్లీ: సనాతన ధర్మాన్ని అవమానించిన వారి దిష్టిబొమ్మల తొలగింపు

    దిల్లీ: సనాతన ధర్మాన్ని అవమానించిన వారి దిష్టిబొమ్మల తొలగింపు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 24, 2023
    08:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దసరా అనేది హిందువుల పండుగ. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.

    ప్రతి సంవత్సరం,దుష్టత్వంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో రావణుడు,మేఘనాథుడు,కుంభకర్ణుడు లాంటి వేలాది దిష్టిబొమ్మలను దహనం చేస్తారు.

    దిల్లీలో రామలీలాల సందర్భంగా అవినీతి, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటి సామాజిక సమస్యలకు సంబంధించిన దిష్టిబొమ్మలను దహనం చేయడం చాలా కాలంగా వస్తున్న ఆచారం.

    అయితే, ఇటీవల స‌నాత‌న ధ‌ర్మంపై త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారాన్ని రేప‌డంతో బాటుగా దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసిన విషయం తెలిసిందే.

    అందుకని ఈ ఏడాది సనాతన ధర్మాన్ని అవమానించిన వారి దిష్టిబొమ్మలను దసరా వేడుకల కోసం ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో ఏర్పాటు చేశారు.

    Details 

    రావ‌ణ ద‌హ‌నం కార్యక్రమానికి ప్రముఖులు 

    ఆ దిష్టి బొమ్మల మెడకు పాదరక్షల దండలు చుట్టి దానిపై 'సనాతన ధర్మంపై దాడి చేసేవారిని తరిమికొట్టండి'అనే నినాదాలతో కూడిన పోస్టర్లను అతికించారు.

    ఢిల్లీలోని రామలీలా కార్యక్రమాలకు కేంద్ర సంస్థ అయిన శ్రీ రామలీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ,"పురాణ విరోధుల విగ్రహాలు 80 నుండి 100 అడుగుల ఎత్తులో ఉంటాయని,అదే సనాతన ధర్మ వ్యతిరేకులకు ప్రాతినిధ్యం వహిస్తున్నవి 6 నుండి 15 అడుగుల వరకు ఉంటాయని తెలిపారు.

    ఈ రావ‌ణ ద‌హ‌నం కార్యక్రమానికి బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌,ఎల్జీ వీకే స‌క్సేనా స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు ముఖ్యఅతిధులుగా హాజరవుతున్న సంద‌ర్భంగా దిష్టిబొమ్మ‌ల‌పై స‌నాత‌న ధ‌ర్మ వ్య‌తిరేకుల లేబుల్స్‌ను అధికారులు తొల‌గించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సనాతన ధర్మాన్ని అవమానించిన వారి దిష్టిబొమ్మలు

    #WATCH | Effigies of Ravan, Meghanad and Kumbhkaran, along with those opposing Sanatan Dharma, installed at Delhi's Red Fort ground for #Dussehra pic.twitter.com/B36VeKWrhj

    — ANI (@ANI) October 24, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    దిల్లీ

    'దిల్లీ డిక్లరేషన్‌' వెనుక 200 గంటలు, 300 భేటీలు, 15 ముసాయిదాల కృషి జీ20 సమావేశం
    BRI Exit Italy: జీ20 వేదికగా చైనాకు షాకిచ్చిన ఇటలీ ఇటలీ
    దిల్లీ: దీపావళికి బాణాసంచా కాల్చడంపై ప్రభుత్వం నిషేధం  తాజా వార్తలు
    జీ20 సదస్సుకు వచ్చిన చైనా బృందం వద్ద అనుమాస్పద బ్యాగులు.. హోటల్‌లో హై డ్రామా జీ20 సమావేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025