NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pinnelli Ramakrishna Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం.. లుక్ అవుట్ నోటీసులు జారీ 
    తదుపరి వార్తా కథనం
    Pinnelli Ramakrishna Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం.. లుక్ అవుట్ నోటీసులు జారీ 
    మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం.. లుక్ అవుట్ నోటీసులు జారీ

    Pinnelli Ramakrishna Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం.. లుక్ అవుట్ నోటీసులు జారీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 22, 2024
    02:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మే 13న పోలింగ్ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేస్తూ కెమెరాకు చిక్కిన వైఎస్సార్సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మంగళవారం ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించింది.

    మాచర్ల నియోజకవర్గంలోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎం) పాడైపోగా,పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేట్‌ పోలింగ్‌ కేంద్రంలో పిన్నెల్లి ప్రవేశించి ఈవీఎంను నేలకేసి పగలగొట్టిన దృశ్యాలు వెబ్‌కాస్టింగ్‌లో నమోదయ్యాయి.

    ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ, సంబంధిత వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించింది.

    ఈ ఘటనకు సంబంధించి సాయంత్రం 5గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకుకి ఆదేశాలు జారీ చేసింది.

    Details 

    ఎమ్మెల్యే పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు.. భ‌విష్య‌త్ లో ఎన్నిక‌ల‌లో పాల్గొన‌కుండా నిషేదం

    ఏడు ఈవీఎంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారు.

    విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చారు. తద్వారా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరని ఎన్నికల సంఘం భావిస్తోంది.

    ఈవీఎం ధ్వంసానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారంద‌ర్ని ఆరెస్ట్ చేయాల‌ని కూడా మీనా కోరారు.

    అలాగే ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎమ్మెల్యే పై క్రిమిన‌ల్ చ‌ర్య‌ల‌తో పాటు భ‌విష్య‌త్ లో ఎన్నిక‌ల‌లో పాల్గొన‌కుండా నిషేదం విధించే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్నారు.

    Details 

    పిన్నెలిపై లుక్ ఔట్ నోటీసులు జారీ 

    ఈ క్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    దీంతో అన్ని ఎయిర్‌పోర్టులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తం చేశారు.

    లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు పిన్నెల్లి తక్షణమే అరెస్ట్‌ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మాచర్ల

    తాజా

    ISRO: 18న ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం: చైర్మన్ వి నారాయణన్ ఇస్రో
    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ

    మాచర్ల

    Pinnelli Ramakrishna Reddy: ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లికి ఊహించని కష్టాలు ! ఎన్నికల సంఘం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025