NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఈసీ షరతులతో కూడిన ఆమోదం 
    తదుపరి వార్తా కథనం
    Telangana: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఈసీ షరతులతో కూడిన ఆమోదం 
    నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఈసీ షరతులతో కూడిన ఆమోదం

    Telangana: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఈసీ షరతులతో కూడిన ఆమోదం 

    వ్రాసిన వారు Stalin
    May 20, 2024
    12:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ఎన్నికల సంఘం తెలంగాణలో ఇవాళ మంత్రివర్గ సమావేశం పెట్టుకోవడానికి షరతులతో కూడిన ఆమోదం తెలపడంతో సోమవారం ఇక్కడ సమావేశం కానుంది.

    రైతు రుణమాఫీపై భారతీయ రాష్ట్ర సమితి (భారాస) వేసే రాజకీయ వత్తిళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఊపిరి ఆడనివ్వడం లేదు.

    ఎన్నికల సంఘం షరతులతో కేబినెట్ బేజారు

    ఈ తరుణంలో ఎన్నికల సంఘం షరతుల నడుమ తెలంగాణలో ఇవాళ మంత్రివర్గ సమావేశం కానుంది.

    షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే భేటీలో అత్యవసర అంశాలపైనే చర్చ ఉంటుంది.

    ఉమ్మడి రాజధాని పెండింగ్ అంశాలు, రైతుల రుణమాఫీపై చర్చించకూడదు అనీ, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను ఈ భేటీకి పిలవ వద్దని ఈసీ కండీషన్స్ పెట్టింది.

    Details

    చప్పగా జరగనున్న కేబినెట్ భేటీ

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీలో తేలికైన అంశాలపైనే చర్చిస్తారు.

    ప్రభుత్వం ముందుగా అనుకున్న ప్రకారం ఏపీ, తెలంగాణ విభజన అంశాలు, రైతుల రుణమాఫీ అంశాలను చర్చించాలనుకుంది.

    కానీ.. ఈసీ కుదరదని చెప్పడంతో.. ఈ అంశాలపై ఏ చర్చా ఉండదు. జూన్ 4న ఫలితాలు వస్తాయి

    కాబట్టి అప్పటి వరకూ కేబినెట్లో కీలక అంశాలను చర్చించకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

    ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసరమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవచ్చని ఈసీ తెలిపింది.

    Details 

    రైతుల రుణాలపై మాట నిలబడకపోతే రేవంత్ రెడ్డి ఇరకాటమే

    రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 లోగా రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.

    ఐతే.. ఇదివరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలను మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

    ఆ నమ్మకంతో చాలా మంది రైతులు రుణాలు తీసుకున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు దాటినా ఇంకా రుణమాఫీ అమలు చెయ్యలేదు.

    దాంతో రైతులు చేసిన అప్పులపై వడ్డీలు పెరిగిపోతున్నాయి. అందువల్ల కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకొని.. త్వరగా అమలు చేస్తారని రైతులు ఎదురుచూస్తుంటే.. ఈసీ నిర్ణయంతో.. అమలు మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.

    ఎన్నికల ఫలితాలు వచ్చాక.. మళ్లీ కేబినెట్ భేటీ ఎప్పుడు జరుపుతారో, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు అమలు చేస్తారో అనేది తేలాల్సిన అంశం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఎన్నికల సంఘం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తెలంగాణ

    Yadadri: సోమవారం నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. సీఎం రేవంత్‌కు ఆహ్వానం  యాదాద్రి
    CM Revanth Reddy: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి  యాదాద్రి
    Telangana: తెలంగాణలో శివలింగాన్ని పోలిన పర్షియన్ శాసనం లభ్యం  భారతదేశం
    ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు హైదరాబాద్

    ఎన్నికల సంఘం

    Lok Sabha Election schedule: మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్!  లోక్‌సభ
    Lok Sabha Elections 2024: మార్చి 13 తర్వాత లోక్‌సభ ఎన్నికలు  ఎన్నికలు
    ECI: అధికారుల బదిలీలపై రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు లోక్‌సభ
    Lok Sabha Election: ఏప్రిల్ 19న లోక్‌సభ పోలింగ్.. మే 22న ఫలితాలు.. ఎన్నికల సంఘం క్లారిటీ లోక్‌సభ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025